Begin typing your search above and press return to search.

భ‌ర్త జైలుకి వెళ్లాక న‌టికి అవ‌మానాలు!

తాజాగా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు జైలు జీవితం నేప‌థ్యంలో త‌న భార్య‌, నటి శిల్పాశెట్టి కెరీర్ పై ఎలా ప‌డిందో వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   5 March 2024 2:30 PM GMT
భ‌ర్త జైలుకి వెళ్లాక న‌టికి అవ‌మానాలు!
X

ప్ర‌ముఖ న‌టి భ‌ర్త నీలి చిత్రాల యాప్ ల‌ బిజినెస్ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో జైలుకు వెళ్లారు. న‌టీమ‌ణుల‌తో శృంగార చిత్రాల‌ను తీసార‌నేది ప్ర‌ధాన అభియోగం. అయితే ఆ క్లిష్ట స‌మ‌యంలో స‌ద‌రు న‌టీమ‌ణి కోట్లాది రూపాయ‌ల ఒప్పందాల‌ను న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. త‌న‌తో కాంట్రాక్టులు కుదుర్చుకున్న ప‌లు ఎంట‌ర్ టైన్ మెంట్ చానెళ్లు వాటిని ర‌ద్దు చేసుకున్నాయి. ఆమె కెరీర్ పూర్తి చిక్కుల్లో ప‌డింది. కానీ అనూహ్యంగా తన భ‌ర్త‌కు క‌ష్ట‌కాలంలో అండ‌గా నిల‌వ‌డ‌మే కాకుండా త‌న కుటుంబాన్ని కాపాడుకునేందుకు చేయాల్సిన ప్ర‌య‌త్నాలన్నీ చేసారు. ఇప్పుడు కాలంతో పాటే మార్పు. త‌న భ‌ర్త జైలు నుంచి బ‌య‌టికి వ‌చ్చారు. త‌న‌తో క‌లిసి ఉంటున్నారు. పిల్ల‌ల‌తో ఈ జంట‌ సంతోషంగానే ఉన్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ ఎవ‌రిదో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా జంట గురించే ఇదంతా. తాజాగా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు జైలు జీవితం నేప‌థ్యంలో త‌న భార్య‌, నటి శిల్పాశెట్టి కెరీర్ పై ఎలా ప‌డిందో వెల్ల‌డించారు. తన వివాహంపై దాని ప్రభావం గురించి ఓపెన‌య్యారు. వివాదం త‌న‌ను చుట్టుముట్టినప్పటికీ తమ వైవాహిక బంధం స్థిరంగా ఉందని కుంద్రా వెల్లడించాడు.

ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌ల వ‌ల్ల‌ శిల్పా శెట్టి వృత్తిపరమైన వైఫల్యాలను ఎదుర్కొంద‌ని, త‌మ‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని కూడా రాజ్ కుంద్రా అన్నారు. అయితే త‌మ మ‌ధ్య‌ భాగస్వామ్య అవగాహన, విశ్వాసం కారణంగా తన సంబంధం స్థిరంగా ఉందని తెలిపాడు. సవాళ్లు ఎదురైన‌ సమయంలో శిల్పా శెట్టి తన బలానికి మూలస్తంభంగా నిలిచింద‌ని తెలిపాడు. గందరగోళం న‌డుమ‌ పరస్పర విశ్వాసం ఓదార్పునిచ్చిందని నొక్కి చెప్పాడు.

త‌న‌పై ఆరోప‌ణ‌లు రాగానే.. శిల్పా స్పందన ఎలా ఉందో కూడా రాజ్ కుంద్రా వెల్లడించారు. నిరాధారమైన ఆరోపణలను కొట్టిపారేసిన శిల్పా నవ్వుతూ ఏమ‌న్నారంటే.. ''మీరు ఇంట్లో కలిసి జీవిస్తున్నట్లయితే p*rn వంటిది ఏదైనా ఉంటే తెలిసిపోతుంది'' అని అన్నార‌ట‌. ఈ కేసు సృష్టించిన ప్రతికూల ప్రచారం కారణంగా శిల్పాకు భారీ ఎదురుదెబ్బలు త‌గిలాయి. టెలివిజన్ అవకాశాలను కోల్పోయిందని ఆయన వెల్లడించారు. ఇది చాలా అన్యాయ‌మ‌ని తాను ఒక ప్ర‌ముఖ న‌టిని పెళ్లాడ‌టం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌ని అన్నాడు. నా భార్య పిల్లలపై సాగిన‌ దాడి ఇది.. తీవ్ర న‌ష్టం జ‌రిగింది.. అని అన్నారు.

వృత్తిపరంగా చూస్తే.. శిల్పాశెట్టి ఇటీవల రోహిత్ శెట్టి నిర్మాత‌గా, సుశ్వంత్ ప్రకాష్ దర్శకత్వం వహించిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్‌'లో కనిపించింది. సిద్ధార్థ్ మల్హోత్రా , వివేక్ ఒబెరాయ్ కూడా నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. రాజ్ కుంద్రా తన జైలు జీవిత ప్రయాణం ఆధారంగా తీసిన UT69తో న‌టుడిగా కెరీర్ ప్రారంభించాడు.