Begin typing your search above and press return to search.

శర్వా.. ఎందుకు ఆగినట్లు?

ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకి వెళ్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్యతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Dec 2023 11:48 AM GMT
శర్వా.. ఎందుకు ఆగినట్లు?
X

శర్వానంద్ సినిమా కెరియర్ గత కొన్నేళ్లుగా అనుకున్నంత పాజిటివ్ గా అయితే నడవడం లేదు. చివరి ఆరు సినిమాలలో ఒకే ఒక జీవితం మాత్రమే కాస్తా హిట్ టాక్ తెచ్చుకుంది. మిగిలిన సినిమాలు అన్ని డిజాస్టర్ అయ్యాయి. కాంబినేషన్స్ నమ్ముకున్న ఎంచుకున్న కథలలో దమ్ము లేకపోవడంతో ప్రేక్షకులని మెప్పించలేదు. దీంతో ప్రస్తుతం కథల ఎంపికలో చాలా కేర్ తీసుకుంటున్నారు.

ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకి వెళ్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్యతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ నడుస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ప్లాన్ చేశారు. కానీ అవుట్ ఫుట్ రష్ చూసిన తర్వాతనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దామని శర్వానంద్ హోల్డ్ లో పెట్టారంటా.

దీంతో ఫస్ట్ లుక్ ఆగిపోయింది. ఇక మూవీకి బేబీ ఆన్ బోర్డు అనే పేరుని ముందుగా పరిశీలించారు. తరువాత మనమే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో కూడా శర్వానంద్ అంత సంతృప్తికరంగా లేడంట. అందుకే టైటిల్ రిలీజ్ కూడా ఆపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ భార్య రక్షితరెడ్డి గర్భవతిగా ఉంది.

దీంతో ఆమెని చూసుకోవడానికి శర్వానంద్ యూఎస్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గురించి ఆలోచిద్దామని టీమ్ కి చెప్పారంట. దీంతో అంత వరకు ఈ రెండు పనులు డైరెక్టర్ పెండింగ్ లో పెట్టారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో శర్వానంద్ కి జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. చివరిగా యూకేలో కీలక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చారు.

ఇండియా వచ్చిన తర్వాత శర్వానంద్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి యూఎస్ వెళ్లారు. ప్రస్తుతం రక్షిత మంత్స్ లో ఉన్నారని తెలుస్తోంది. అందుకే డెలివరీ అయ్యేంత వరకు ఆమె దగ్గరే ఉండాలని శర్వానంద్ డిసైడ్ చేసుకొని యూఎస్ వెళ్లారని టాక్.