Begin typing your search above and press return to search.

14 ఏళ్ల తర్వాత వైశాలి శబ్దం..

కోలీవుడ్ డైరెక్టర్ అరివళగన్, హీరో ఆది పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన 'వైశాలి' మూవీ అప్పట్లో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Dec 2023 10:41 AM GMT
14 ఏళ్ల తర్వాత వైశాలి శబ్దం..
X

కోలీవుడ్ డైరెక్టర్ అరివళగన్, హీరో ఆది పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన 'వైశాలి' మూవీ అప్పట్లో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. తమిళంలో 'ఈరం' పేరుతో 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసిన పాటలు అప్పట్లో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి

తమన్ కి ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మరింత గుర్తింపు లభించింది. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత ఈ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. సుమారు 14 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం 'శబ్దం'. మరోసారి ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారర్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి సరసన లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను డిసెంబర్ 14న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియో కాస్త ఫస్ట్ లుక్ పై మరింత ఆసక్తిని పెంచేసింది. చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న హారర్ మూవీ కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమాలో సీనియర్ నటి లైలా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లైలా కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల కార్తి హీరోగా నటించిన సర్దార్ మూవీలో ముఖ్య పాత్ర పోషించింది. తాజాగా అరివళగన్, ఆది పినిశెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'శబ్దం' మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రీసెంట్ గానే ఆమె తాలుకు పోస్టర్ రిలీజ్ చేశారు. శబ్దం సినిమాలో ఆమె పాత్ర అందరిని సర్ప్రైజ్ చేస్తుందని, ఈ సినిమాతో మళ్లీ లైలా వరుస అవకాశాలతో బిజీ అవుతారని చిత్ర యూనిట్ చెప్పింది. 7G ఫిలిమ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. 2024 లో ఈ సినిమాని శకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.