Begin typing your search above and press return to search.

సీక్వెల్ రీమేక్ పై మెగా ఉద్దేశ్యం ఏంటో..!

ఈ మధ్య కాలంలో సూపర్‌ హిట్‌ సినిమాలకు సీక్వెల్స్ రావడం కామన్ విషయంగా మారింది

By:  Tupaki Desk   |   2 Jan 2024 7:08 AM GMT
సీక్వెల్ రీమేక్ పై మెగా ఉద్దేశ్యం ఏంటో..!
X

ఈ మధ్య కాలంలో సూపర్‌ హిట్‌ సినిమాలకు సీక్వెల్స్ రావడం కామన్ విషయంగా మారింది. హిట్‌ కాన్సెప్ట్‌ తో సినిమా తీస్తే హిట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా సినిమా కు ఎక్కువ పబ్లిసిటీ చేయకుండానే మంచి పబ్లిసిటీ దక్కుతుంది. కనుక సీక్వెల్స్ కి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.


అందులో భాగంగానే మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ కి సీక్వెల్‌ రాబోతుంది. గత కొన్నాళ్లుగా ఈ విషయమై ప్రచారం జరుగుతోంది. అయితే ఎట్టకేలకు ఆ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చింది. లూసీఫర్‌ సీక్వెల్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అంతే కాకుండా పోస్టర్‌ ను కూడా విడుదల చేయడం జరిగింది.

‘L2E: ఎంపిరాన్’ అనే టైటిల్‌ తో సీక్వెల్‌ రాబోతుంది. మోహన్ లాల్‌ మరియు పృథ్వీరాజ్ సుకుమార్‌ కాంబోలోనే ఈ సీక్వెల్‌ కూడా రూపొందబోతుంది. ఈ సీక్వెల్‌ ప్రకటన తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే లూసీఫర్‌ ను తెలుగు లో చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ అంటూ రీమేక్‌ చేసిన విషయం తెల్సిందే.

చిరు గాడ్‌ ఫాదర్‌ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సల్మాన్‌ ఖాన్‌ కూడా సినిమాలో నటించడం ద్వారా మంచి బజ్ క్రియేట్‌ అయ్యి ఓపెనింగ్ కలెక్షన్స్‌ బాగా నమోదు అయ్యి, లాంగ్‌ రన్‌ లో కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. కనుక లూసీఫర్‌ సీక్వెల్‌ ను రీమేక్‌ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చిరంజీవి ఆ మధ్య బ్రో డాడీ సినిమాను రీమేక్‌ చేయాలని భావించి భోళా శంకర్‌ సినిమా ఫలితం తో తన ఉద్దేశ్యం మార్చుకున్నాడు. కొత్త కథతో ప్రస్తుతం సినిమా ను చేస్తున్నాడు. కనుక లూసీఫర్‌ సీక్వెల్‌ విషయంలో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది తెలియాలి అంటే ఆ సినిమా పూర్తి అయ్యి, విడుదల అవ్వాల్సి ఉంది. ఇప్పటి నుంచే సీక్వెల్‌ రీమేక్‌ పై చర్చలు అనవసరం అన్నట్లుగా చిరు కాంపౌండ్‌ వారు మాట్లాడుకుంటూ ఉన్నారట.