Begin typing your search above and press return to search.

సీక్రెట్ గా మల్టీస్టారర్ షూటింగ్.. ముగ్గురు హీరోలట

అయితే మరొక యంగ్ డైరెక్టర్ యంగ్ హీరోలతో కూడా ఈ సంస్థ చాలా సైలెంట్ గా ఒక సినిమా షూటింగ్ కొనసాగిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 12:30 PM GMT
సీక్రెట్ గా మల్టీస్టారర్ షూటింగ్.. ముగ్గురు హీరోలట
X

టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఇప్పుడు సీక్రెట్ గా కొన్ని సినిమాలు షూటింగ్స్ కొనసాగుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాను చాలా సైలెంట్ గా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అధికారికంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు.

కానీ సైలెంట్ గానే సినిమా షూటింగ్ ఇప్పటికే సగం వరకు చేరుకుతుంది. అయితే మరొక యంగ్ డైరెక్టర్ యంగ్ హీరోలతో కూడా ఈ సంస్థ చాలా సైలెంట్ గా ఒక సినిమా షూటింగ్ కొనసాగిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. రవితేజతో ప్రస్తుతం ఈగల్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మరోవైపు సైలెంట్ గా మరొక సినిమా షూటింగ్ కూడా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈగల్ సినిమాకు సంబంధించిన ఫైనల్ అవుట్ ఫుట్ అయితే సిద్ధమైంది. దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడమే తరువాయి భాగం ఉన్నట్లుగా నిర్మాణ సంస్థ ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే దర్శకుడు కార్తీక్ మరోవైపు మంచు మనోజ్ తో పాటు తేజ సజ్జా తో కలిసి డిఫరెంట్ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ముగ్గురు హీరోలు కనిపిస్తారట. కానీ మరొక హీరో ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. త్వరలోనే ఈ విషయంలో కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అఫీషియల్ గా ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక దాదాపు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను సైలెంట్ గా 40 శాతానికి పైగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక మిగిలిన షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక మరొక స్టార్ హీరో ఎవరు అనే విషయంలో సోషల్ మీడియాలో కూడా చాలా రకాలుగా గాసిప్స్ అయితే వచ్చాయి. ఆ మధ్య రవితేజ ఉన్నట్లు ఒక టాక్ వచ్చింది. కానీ అది ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే నిర్మాణ సంస్థ అధికారికంగా క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.