Begin typing your search above and press return to search.

శ్రీకాళహస్తికి వెళ్లిన తేజ్... తెరపైకి హారతి ఇష్యూ!

ఈ క్రమంలో ఉపాలయం లో ఉన్న చంగల్ రాయ స్వామి దగ్గర కు వచ్చిన సమయంలో హీరో తేజ్ కి అక్కడున్న సిబ్బంది హారతి పల్లెం అందించార ని అంటున్నారు.

By:  Tupaki Desk   |   15 July 2023 7:45 AM GMT
శ్రీకాళహస్తికి వెళ్లిన తేజ్... తెరపైకి హారతి ఇష్యూ!
X

సుప్రీం హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ "విరూపాక్ష" సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే "బ్రో.. ది అవతార్" మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా లో తన మామయ్య పవన్ కల్యాణ్ తో నటిస్తున్నారు తేజ్!

ఈ సమయం లో తాజాచిత్రం "బ్రో" ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై మెగా ఫాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. జులై 28న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న తేజ్... ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ "జాణవులే" ఈరోజు తిరుపతి లో లాంచ్ చేయనున్నారు.

ఈ లవ్ సాంగ్ లాంచ్ కోసం తిరుపతి వెళ్లిన సాయి ధరమ్ తేజ్... దగ్గర లో ఉన్న శ్రీకాళహస్తికి వెళ్లి రాహుకేతు పూజ చేయడంతో పాటు స్వామివారి ని దర్శించుకున్నాడు. ఈ క్రమంలో ఉపాలయం లో ఉన్న చంగల్ రాయ స్వామి దగ్గర కు వచ్చిన సమయంలో హీరో తేజ్ కి అక్కడున్న సిబ్బంది హారతి పల్లెం అందించార ని అంటున్నారు.

దీంతో... స్వయంగా సాయి తేజ్ చేతుల మీదు గా స్వామివారికి హారతి ఇప్పించారని అంటున్నారు. దీంతో ఇలా చేయడం విరుద్ధం అంటూ పలువురు భక్తులు స్పందిస్తున్నారని కథనాలొస్తున్నాయి. అయితే ఈ విషయం పై ఆలయ అర్చకులు మాత్రం ఏలాంటి వ్యాఖ్యలూ చేయలేదని సమాచారం.

కాగా... శుక్రవారం సాయి ధరమ్ తేజ్ కడప పెద్ద దర్గాను దర్శించుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రత్యేక ప్రార్థనల నిర్వహించిన అనంతరం "ఇది నాకు పునర్జన్మ దేవుడే మళ్ళీ పునర్జన్మ ప్రసాదించాడు అందుకే ఆలయాల ను సందర్శిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు. ఇదే సమయం లో... కడప లోని ఫేమస్ పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ అని సాయి తెలిపారు!