Begin typing your search above and press return to search.

'డబుల్‌ ఇస్మార్ట్‌' విలన్ పారితోషికం డబుల్‌..!

ఇదే సమయంలో బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా లో విలన్ పాత్రలో నటిస్తున్నందుకు గాను ఏకంగా రూ.15 కోట్ల పారితోషికం ను సంజయ్ దత్ అందుకుంటున్నాడట.

By:  Tupaki Desk   |   2 Aug 2023 10:08 AM GMT
డబుల్‌ ఇస్మార్ట్‌ విలన్ పారితోషికం డబుల్‌..!
X

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వం లో రూపొంది కరోనా కు ముందు వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌'. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కీలక సమయంలో రామ్ మరియు పూరికి మంచి బూస్ట్ లభించినట్లు అయింది.

మరోసారి ఇస్మార్ట్‌ శంకర్‌ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్‌, పూరి కాంబోలో డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా ప్రారంభం అయింది. అధికారిక ప్రకటన రావడంతో పాటు షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించి మొదటి షెడ్యూల్‌ ను కూడా ముగించడం జరిగింది.

ఈ సినిమా లో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్ దత్ ను విలన్ పాత్రలో నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా లో విలన్ పాత్రలో నటిస్తున్నందుకు గాను ఏకంగా రూ.15 కోట్ల పారితోషికం ను సంజయ్ దత్ అందుకుంటున్నాడట.

సాధారణంగా సంజయ్ దత్‌ ఒకొక్క సినిమాకు గాను రూ.10 కోట్లకు అటు ఇటుగా పారితోషికం తీసుకుంటూ ఉంటాడట. కానీ ఈ సినిమా కోసం ఏకంగా 60 రోజుల డేట్లను సంజయ్ దత్‌ ఇవ్వడం జరిగిందట. అందుకే దాదాపుగా డబుల్‌ పారితోషికంను పూరి ఇస్తున్నాడు అంటున్నారు.

సౌత్ సినిమా ల్లో నటించే విలన్స్ కు అయిదు నుండి ఏడు ఎనిమిది కోట్ల పారితోషికంను ఇస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా డబుల్ పారితోషికం అందుకుంటున్నాడు. మరి సంజయ్ దత్‌ ఉన్నంత మాత్రాన సినిమా మంచి విజయాన్ని అందుకునేనా.. బాలీవుడ్ లో మంచి బిజినెస్ అయ్యేనా చూడాలి.