‘స్త్రీ-’ని చూసి వాత పెట్టుకుని..
సంజయ్ దత్ లాంటి సీనియర్ హీరో లీడ్ రోల్ చేశాడు. మౌని రాయ్ కథానాయికగా నటించింది.
By: Tupaki Desk | 7 May 2025 8:00 AM ISTసంజయ్ దత్ లాంటి సీనియర్ హీరో లీడ్ రోల్ చేశాడు. మౌని రాయ్ కథానాయికగా నటించింది. సన్నీ సింగ్, పాలక్ తివారి లాంటి పేరున్న నటులు ముఖ్య పాత్రలు పోషించారు. కంటెంట్ మీద నమ్మకంతో సంజయ్ దత్యే మరో నిర్మాతతో ప్రొడ్యూస్ చేశాడు. కానీ ఇవేవీ ‘భూత్ని’ సినిమాను కాపాడలేకపోయాయి. కొంత కాలంగా బాలీవుడ్లో హార్రర్ 2 కామెడీలు బాగా ఆడుతున్న నేపథ్యంలో ఆ జానర్లో సినిమా తీస్తే భూత్ని బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
రైడ్-2 లాంటి క్రేజీ మూవీతో పోటీ పడడం దీనికి పెద్ద ప్రతికూలతగా మారింది. భూత్నికి పేలవమైన ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు కనీసం కోటి రూపాయల నెట్ వసూళ్లు సాధించలేకపోయిందీ సినిమా. దేశవ్యాప్తంగా కేవలం రూ.50 లక్షల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తర్వాత కూడా పుంజుకోలేకపోయింది. తర్వాతి మూడు రోజుల్లో కలిపి 1.75 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రాబట్టగలిగింది.
వీకెండ్ తర్వాత సినిమాపై ఎలాంటి ఆశలు కనిపించడం లేదు. మినిమం ఆక్యుపెన్సీలు లేక షోలు క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి. గత ఏడాది హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కిన స్త్రీ-2 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ముంజియా, భూల్ భులయియా-2 లాంటి హార్రర్ కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలందుకున్నాయి. దీంతో హార్రర్ కామెడీ జానర్లో సినిమా తీస్తే చాలు.. బ్లాక్ బస్టర్ కొట్టేయొచ్చన్న ధీమాతో ఈ సినిమా తీసినట్లున్నారు. కానీ దీని ప్రోమోలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేకపోయాయి.
మినిమం బజ్ లేకుండా సినిమా రిలీజైంది. ఐతే కంటెంట్ బాగుంటే సినిమా పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ అదీ లేకపోయింది. ప్రేక్షకుల ఛాయిస్ రైడ్-2నే కావడంతో దీనివైపు ఎవ్వరూ చూడట్లేదు. థియేటర్ల నుంచి వచ్చే మొత్తం నామమాత్రమే. ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయంతో కొంత మేర పెట్టుబడి రికవర్ అవుతుంది తప్ప.. ఈ సినిమా వల్ల నిర్మాతలకు గట్టి దెబ్బ తప్పదన్నట్లే.