Begin typing your search above and press return to search.

అలా రెచ్చగొడితే.. యానిమాల్ కథ పుట్టిందట

అంతేకాకుండా ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు రాజీవ్ మసంద్ కూడా ఈ సినిమా వైలెంట్ గా ఉంది అని అన్నట్లుగా ఒక నెగిటివ్ రివ్యూ కూడా ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 1:06 PM GMT
అలా రెచ్చగొడితే.. యానిమాల్ కథ పుట్టిందట
X

దర్శకుడు సందీప్ రెడ్డి ఇప్పటివరకు ఒకే ఒక్క కథతో రెండు సినిమాలను తీసాడు. తెలుగులో సక్సెస్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్ గా చేసి సక్సెస్ కొట్టాడు. అయితే తెలుగులో కంటే బాలీవుడ్ లో మరింత ఎక్కువ స్థాయిలో సక్సెస్ గా ఆ సినిమా.నిలిచింది. ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా యానిమల్ సినిమాను దర్శకుడు వెండితెరపైకి తీసుకురాబోతున్నారు.

కేవలం ఒకే ఒక్క కథతోనే సందీప్ ఒక స్టార్ దర్శకుల తరహాలో గుర్తింపును అయితే అందుకున్నాడు. యానిమల్ ట్రైలర్ తోనే సినిమాకు కావాల్సినంత పాజిటివ్ బజ్ అయితే తీసుకోవచ్చాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుందని బాక్సాఫీస్ ఆఫీస్ పండితులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు.

ఇక మొదటి రోజు కొన్ని ఏరియాలలో కూడా స్టార్ హీరోల సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుంది అని అలా కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఇంతటి యానిమాల్ బీభత్సం వెనుక పరోక్షంగా అయితే ఒక నెగిటివ్ కామెంట్ కూడా ఉంది అని సందీప్ రెడ్డి వంగ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి కథను బాలీవుడ్లో కబీర్ సింగ్ గా చేసినప్పుడు అక్కడ కూడా కొంతమంది మీడియా వాళ్ళు ఆ సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేశారు..

అంతేకాకుండా ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు రాజీవ్ మసంద్ కూడా ఈ సినిమా వైలెంట్ గా ఉంది అని అన్నట్లుగా ఒక నెగిటివ్ రివ్యూ కూడా ఇచ్చాడు. ఇక సందీప్ రెడ్డి అనంతరం ఒక ఇంటర్వ్యూలో ఆ కామెంట్ కు దీటుగా జవాబు కూడా ఇచ్చాడు. అసలు అర్జున్ రెడ్డిలో హింస అనేది లేదని అసలైన వైలెంట్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో నెక్స్ట్ చూపిస్తాను అని అప్పుడే సవాల్ విసిరాడు.

ఇక ఆ కసితోనే సందీప్ రెడ్డి ఇప్పుడు యానిమల్ సినిమాను డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో అరాచకం అనే పద్ధతిలోనే విలన్స్ ను ఊచకోత కోసే విధానం హైలెట్గా నిలుస్తుందని ట్రైలర్ తోనే చెప్పేశాడు. ఇక సినిమా మొత్తం లో కూడా ఆ వైలెంట్ డోస్ ఏ లెవెల్ లో ఉంటుందో మీ ఊహలకి వదిలేస్తున్నాను అని అన్నట్లుగా కూడా ఒక ప్రశ్నను లేవనెత్తాడు.

దీంతో సినిమాపై కావాల్సినంత బజ్ అయితే పెరిగింది. ఈ సినిమాను చూడాలి అని యూత్ ఇప్పుడు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఈ సినిమా తీసినప్పటికీ తెలుగులో కూడా మంచి క్రేజ్ అయితే ఏర్పడింది మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా విమర్శకులకు కౌంటర్ ఇచ్చే విధంగా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.