Begin typing your search above and press return to search.

ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి : సమంత

ఈ కార్యక్రమంలో సమంత తో పాటు ఆద్యాత్మిక గురువు రవి శంకర్ మరియు బాలీవుడ్‌ స్టార్ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ లు పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   21 Aug 2023 8:56 AM GMT
ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి : సమంత
X

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ప్రతిష్టాత్మక ఇండియా పరేడ్ కార్యక్రమంలో ఈ సంవత్సరంకు గాను పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌ సమంత పాల్గొంది. కొన్ని వారాల క్రితమే సమంత ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లుగా నిర్వాహకులు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

తాజా ఆదివారం ఇండియా పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమంత తో పాటు ఆద్యాత్మిక గురువు రవి శంకర్ మరియు బాలీవుడ్‌ స్టార్ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్స్ భారీ ఎత్తున పాల్గొనడంతో న్యూయార్క్ మొత్తం సందడి వాతావరణం నెలకొందని స్థానిక మీడియా కథనాలు వచ్చాయి.

ఇండియా పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సమంత మాట్లాడుతూ... ఈ కార్యక్రమం కోసం న్యూయార్క్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. భారతీయ సంస్కృతి గురించి మరోసారి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. ఇక్కడ చూసిన దృశ్యాలు భారతీయ సంస్కృతికి నాకు మరోసారి అర్థం అయ్యేలా చేశాయి.

ఈ క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి. అలాగే ఈ సందర్భం నా జీవితంలో ఒక మరపురాని సందర్భంగా కూడా నిలుస్తుందని సమంత పేర్కొంది. ఈ కార్యక్రమం కు తనను ఆహ్వానించిన వారికి కృతజ్ఞతలు అంటూ సమంత పేర్కొంది. గతంలో ఈ కార్యక్రమం కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు పలువురు బాలీవుడ్‌ స్టార్స్ కూడా హాజరు అయిన విషయం తెల్సిందే.