Begin typing your search above and press return to search.

తెల్లారి నిద్ర లేచేస‌రికి ఇంత‌లోనే దాడి చేసింది!

స‌మంత రూత్ ప్ర‌భు మ‌యోసైటిస్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు

By:  Tupaki Desk   |   20 Feb 2024 12:44 PM GMT
తెల్లారి నిద్ర లేచేస‌రికి ఇంత‌లోనే దాడి చేసింది!
X

స‌మంత రూత్ ప్ర‌భు మ‌యోసైటిస్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంత‌లోనే మ‌యోసైటిస్ గురించి, ఈ వ్యాధి రాక మునుప‌టి సంవ‌త్స‌రం త‌న‌కు ఎదురైన విడాకుల క‌ష్టం గురించి ఇప్పుడు తాజా పాడ్‌కాస్ట్‌లో స‌మంత ఓపెనైంది. త‌న జీవితంలో తాను ఎదుర్కొన్న 'అత్యంత కష్టమైన' సంవత్సరం గురించి మాట్లాడింది.

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో టేక్ 20 పేరుతో హెల్త్ పాడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్‌ను రిలీజ్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. తొలి ఎపిసోడ్ లో స‌మంత మ‌యోసైటిస్ కంటే ముందు కొన‌సాగిన విడాకుల వ్య‌వ‌హారంతో ఎంత‌గా అల‌సిపోయారో వెల్ల‌డించారు. పోడ్‌కాస్ట్ లో సమంత మాట్లాడుతూ, ''నాకు ఈ సమస్య(అనారోగ్యం) వచ్చే ముందు సంవత్సరం నాకు ప్రత్యేకంగా గుర్తుంది. అది నాకు చాలా కష్టతరమైన సంవత్సరం. నా స్నేహితుడు మేనేజర్ హిమాంక్ నేను ముంబై నుండి తిరిగి ప్రయాణిస్తున్న స‌మ‌యం నాకు ప్రత్యేకంగా గుర్తుంది. గత సంవత్సరం జూన్‌లో ప్ర‌యాణించాం. చివరకు నేను ప్రశాంతంగా ఉన్నానని అతనికి చెప్పాను. ఇది చాలా కాలంగా తనకు అనిపించని విషయం అని స‌మంత చెప్పింది.

''చాలా కాలం త‌ర్వాత‌ నేను కొంచెం రిలాక్స్‌గా ప్ర‌శాంతంగా అనిపించింది. చివరకు నేను ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను.. నేను నిద్రపోగలను.. ఇప్పుడు మేల్కొని నా పనిపై దృష్టి పెట్టగలను.. చేసే పనిలో అత్యుత్తమంగా ఉండగలను. నేను ఈ పరిస్థితితో మేల్కొన్నాను. కానీ ఇంత‌లోనే నేను నిదుర లేచిన మ‌రునాడే ఈ అనారోగ్యం నాపై దాడి చేసింది'' అని ఆవేద‌న చెందింది సామ్. నేను ఈ పాడ్ కాస్ట్ చేయ‌డానికి కార‌ణం ప్ర‌జ‌లు ఇలాంటి వాటిని గుర్తించి జాగ్ర‌త్త‌గా ఉంటార‌నే ఇది చేస్తున్నాను అని కూడా స‌మంత అన్నారు.