Begin typing your search above and press return to search.

సమంత.. ఇంకా అదే స్పీడ్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ మిక్సడ్ టాక్ తెచ్చుకుంది

By:  Tupaki Desk   |   26 Sep 2023 9:39 AM GMT
సమంత.. ఇంకా అదే స్పీడ్!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఈ మూవీకి ముందే సమంత తన వరల్డ్ టూర్ మొదలుపెట్టింది. ఆ టూర్ ని ఆమె ఇంకా కంటిన్యూ చేస్తోంది. ఖుషీ మూవీ షూటింగ్ తర్వాత, సమంత తన సినిమాలు అన్నింటికీ బ్రేక్ ఇచ్చారు.

ఆమె చాలా కాలంగా మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోంది. ఖుషీ మూవీ ఆలస్యం కావడానికి ఇది కూడా ఒక కారణం. అయితే, త్వరగా ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసిన ఆమె మయోసైటిస్ కి చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్లారు. దానికి ముందు ఆమె బాలీ ట్రిప్ కి వెళ్లారు. ఆ తర్వాతే అమెరికాలోని పలు స్టేట్స్ తిరిగారు. డల్లాస్, అట్లాంటా, లాస్ ఏంజెల్స్ వంటి స్టేట్స్ మొత్తం చుట్టేసి వచ్చారు.

మధ్యలో ఖుషీ సక్సెస్ మీట్ లో పాల్గొనడానికి ఆమె ఇండియా వచ్చారు. ఆ సమయంలో రెండు రోజుల ముంబయిలో ఉండి, ఎలాంటి ఈవెంట్ లో పాల్గొనకుండానే మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. అటు నుంచి సమంత యూరప్ వెళ్లారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తన ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను తరచూ సామ్, సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

ఇక, ఈ వరల్డ్ టూర్ లో ఉంటూనే ఆమె తన మయోసైటిస్ కి మెడికేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, సమంత మళ్లీ ఈ మూవీస్ చేయడం మొదలపెట్టే సమయానికి ప్రపంచంలోని చాలా ప్రాంతాలను తిరిగి రావాలని అనుకుంటున్నారట. మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెడితే, ఇలా ఇన్ని ప్రదేశాలను ఒకేసారి చూసే అవకాశం ఉండదు. కాబట్టి, ఆమె ఇప్పుడే అన్నీ చూసేయాలని అనుకుంటోందట.

ఇక, సినిమాలకు బ్రేక్ తీసుకోవడానికి ముందు సమంత, ఖుషీ మూవీతో పాటు, సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి చేసింది. అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.