Begin typing your search above and press return to search.

అమెరికా నుంచి వ‌చ్చాక స‌మంత ఏం చేసిందంటే?

సామ్ ఇప్ప‌టికే ముంబై మీడియాకి ఎంతో స‌న్నిహితురాలు. అమెరికా వెళ్లే ముందే సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్ లో న‌టించింది

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:28 AM GMT
అమెరికా నుంచి వ‌చ్చాక స‌మంత ఏం చేసిందంటే?
X

'ఖుషీ' రూపంలో స‌మంత మ‌రో అద్భుత విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇది ఆనంద‌క‌ర స‌మ‌యం. కానీ ఇలాంటి స‌మ‌యంలో మయోసైటిస్ చికిత్స కోసం అమెరికాలో ఉంది. ఎట్ట‌కేల‌కు చికిత్స పూర్త‌యింది. సమంత ఇండియా తిరిగి వచ్చింది. తొలిగా హైద‌రాబాద్ కి విచ్చేసిన సామ్ వెంట‌నే ముంబైకి వెళ్లింది. ముంబైలో దిగ‌గానే విమానాశ్ర‌యంలో స్టిల్ పోటోగ్రాఫ‌ర్ల‌కు చిక్కింది.

సామ్ ఇప్ప‌టికే ముంబై మీడియాకి ఎంతో స‌న్నిహితురాలు. అమెరికా వెళ్లే ముందే సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్ లో న‌టించింది. పుష్ప‌లో ఊ అంటావా పాట‌తో గొప్ప‌గా పాపుల‌రైంది. అదే క్ర‌మంలో హిందీ ప‌రిశ్ర‌మ‌లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉంది. ఇప్పుడు అక్క‌డ మీడియాకి కూడా సామ్ జిగిరీ జాన్. అందుకే ముంబై మీడియాతో స‌ర‌దాగా మాట్లాడేస్తూ.. నేను ఎలాగైనా మీనుంచి త‌ప్పించుకోవాల‌నుకున్నాను! అంటూ ప‌రిహాసం ఆడింది. దానికి .. మీరు త‌ప్పించుకోలేరు! అంటూ అక్క‌డ ఫోటోగ్రాఫ‌ర్లు స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. నిజానికి స‌మంత అమెరికా నుంచి నేరుగా ఇండియాలో దిగ‌గానే హైద‌రాబాద్ కు చేరుకుంది. ఇక్క‌డ వ్య‌వ‌హారికాల‌ను వెంట‌నే ముగించుకుని అట్నుంచి అటే ముంబైలో అడుగుపెట్టింది. ఇప్పుడు ముంబైలో త‌న క‌మిట్ మెంట్ల‌పై సామ్ సీరియ‌స్ గా గ్రౌండ్ వ‌ర్క్ చేయ‌నుంద‌ని తెలిసింది.

దాదాపు నెల రోజుల పాటు అమెరికాలో గడిపిన సమంత మైయోసైటిస్‌కు చికిత్స చేయించుకున్న సంగ‌తి తెలిసిందే. ఏడాది పాటు ఈ చికిత్స కొన‌సాగుతుంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. ఈ క‌థ‌నాల‌ను బ‌ట్టి స‌మంత మ‌ళ్లీ అమెరికాకు వెళ్లే అవ‌కాశం ఉంది. సెప్టెంబర్ 1న విడుద‌లైన సామ్ ఖుషి బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం సాధించింది. ఈ ఆనందం ఇటీవ‌ల‌ స‌మంత ముఖంలో ప్ర‌స్పుట‌మైంది. 'ఖుషి' విడుదలైన వెంటనే సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది.

సినిమాపై ప్ర‌ద‌ర్శించిన‌ ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. సమంతా తన సోషల్ మీడియా హ్యాండిల్ లో వరుస ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ఖుషి విడుదలకు ముందు తాను అనుభవించిన ఒత్తిడి గురించి కూడా స‌మంత వెల్ల‌డించింది. అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి సమంత సంతోషం వ్యక్తం చేసింది. ఖుషీ విజయాన్ని తన తోటి సహచరులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి సమంత దేశంలో అందుబాటులో లేదు. కానీ అమెరికా నుంచి త‌న ఆనందం వ్య‌క్తం చేసేందుకు సోష‌ల్ మీడియ‌ల్ని ఆశ్ర‌యించింది.