Begin typing your search above and press return to search.

25 ఏళ్ల త‌ర్వాత ఆ క్రేజీ కాంబినేష‌న్

శ‌క్తి వంచ‌న లేకుండా శ్ర‌మిస్తున్నా స‌ల్మాన్ కి మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డ‌టం లేదు

By:  Tupaki Desk   |   2 Jan 2024 10:30 AM GMT
25 ఏళ్ల త‌ర్వాత ఆ క్రేజీ కాంబినేష‌న్
X

స‌ల్మాన్ ఖాన్ కి స‌రైన సాలిడ్ హిట్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. 'భార‌త్' త‌ర్వాత ఆ రేంజ్ హిట్ మ‌రొక‌టి ప‌డ‌లేదు. మ‌ధ్యలో చేసిన సినిమాల్లో కొన్ని యావ‌రేజ్ గా ఆడ‌గా మ‌రికొన్ని ప‌రాజ‌యం చేందాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన టైగ‌ర్ -3 కాస్త ఊర‌ట‌నిచ్చిన చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద న‌ష్టాలు లేకుండా బ‌య‌ట‌ప ప‌డ‌గ‌లిగింది త‌ప్ప అంత‌కు మించి టైగ‌ర్ సాధించింది పెద్ద‌గా లేద‌న చెప్పాలి.

శ‌క్తి వంచ‌న లేకుండా శ్ర‌మిస్తున్నా స‌ల్మాన్ కి మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డ‌టం లేదు. అందుకోసం యాక్ష‌న్ క‌థ‌లే వ‌రుస‌గా చేస్తున్నా! ప‌న‌వ్వ‌డం లేదు. అయినా త‌ర్వాత స‌ల్మాన్ త‌గ్గేదేలే అంటూ ముందుకె ళ్తున్నాడు. అయితే ఈసారి బాలీవుడ్ ద‌ర్శ‌కుడి స్థానంలో కోలీవుడ్ ద‌ర్శ‌కుడిని తెర‌పైకి తెచ్చాడు. సౌత్ మేక‌ర్ తో కొత్త‌గా ట్రై చేద్దామ‌ని భావంచిన భాయ్ కోలీవుడ్ యాక్ష‌న్ మేక‌ర్ విష్ణు వ‌ర్ద‌న్ ని రంగంలోకి దించాడు. ప్ర‌స్తుతం విష్ణు వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ది బుల్' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. యాక్ష‌న్ చిత్రాల‌కు విష్ణు వ‌ర్ద‌న్ పెట్టింది పేరు.

అత‌ని కొన్ని సినిమాలు భారీ హిట్లు సాధించాయి. ఆ న‌మ్మ‌కంతోనే విష్ణు వ‌ర్ద‌న్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇందులో హీరోయిన్ గా త్రిష‌ని ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ సినిమాని నిర్మిస్తోంది ఎవ‌రో? తెలుసా? బాలీవుడ్ బడా నిర్మాత క‌ర‌ణ్ జోహార్. త‌న సొంత బ్యాన‌ర్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ పై ది బుల్ ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీంతో 'ది బుల్' రికార్డు మూవీగా నిలుస్తుంది.

క‌ర‌ణ్ జోహార్ తో స‌ల్మాన్ ఖాన్ సినిమా చేయ‌డం అన్న‌ది 25 ఏళ్ల త‌ర్వాత చోటు చేసుకోవ‌డం ఇదే తొలిసారి. 25 ఏళ్ల క్రితం ఇద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన 'కుచ్ కు చ్ హో హై' ఎలాంటి విజ‌యం సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ చిత్రానికి క‌ర‌ణ్ జోహార్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు. కానీ తాజా చిత్రానికి మాత్రం కేవ‌లం నిర్మాత‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.