సల్మాన్ ఖాన్ను దేశం నుంచి బహిష్కరించాలి!
బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్లలో ఒకరైన సల్మాన్ ఖాన్ ను దేశం నుంచి బహిష్కరించాలని ఒక దేశభక్తుడైన అభిమాని పిలుపునిచ్చాడు.
By: Tupaki Desk | 11 May 2025 6:15 PMబాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్లలో ఒకరైన సల్మాన్ ఖాన్ ను దేశం నుంచి బహిష్కరించాలని ఒక దేశభక్తుడైన అభిమాని పిలుపునిచ్చాడు. ఆపరేషన్ సిందూర్ విషయంలో యుద్ధంలో భారత విక్టరీ నేపథ్యంలో సల్మాన్ కానీ, ఖాన్ లు కానీ స్పందించకపోవడంపై అతడు సీరియస్ గా ఉన్నాడు.
అంతేకాదు.. భారతదేశం - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ గురించి ట్వీట్ చేసిన సల్మాన్ .. కాల్పులు విరమించినందుకు దేవుడికి ధన్యవాదాలు! అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసాడు. కానీ దీనిపై నెటిజనులు దుమ్మెత్తిపోసారు. తీవ్ర వ్యతిరేకత కారణంగా ఈ ట్వీట్ ని సల్మాన్ తొలగించాడు. నియంత్రణ రేఖ (LOC) వెంబడి రెండు పొరుగు దేశాల మధ్య చాలా రోజుల ఘర్షణల తర్వాత కాల్పుల విరమణను ప్రకటించగానే సల్మాన్ దేవుడికి ధన్యవాదాలు చెప్పడం ఎవరికీ నచ్చలేదు.
ఆపరేషన్ సిందూర్ పైనా, భారతీయ సైన్యం విజయాలపైనా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అమితాబ్ బచ్చన్ సహా చాలా మంది హీరోలు కథానాయికలు భారత ఆర్మీకి మద్ధతుగా నిలిచారు. అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ రెండింటిపై సల్మాన్ ఖాన్ మౌనం వహించడం చాలా మంది నెటిజన్లను నిరాశపరిచింది.
ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ.. సల్మాన్ ఖాన్ తన ట్వీట్ను తొలగించాడు.. పహల్గామ్ గురించి ఎటువంటి పోస్ట్లు చేయలేదు. అయితే షారుఖ్ ఖాన్ - అమీర్ ఖాన్ కూడా భారతదేశంపై ఉగ్రవాద దాడి సమయంలో మౌనంగా ఉన్నారు! అని ఆందోళన వ్యక్తం చేసాడు. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు. ``ఈ బాలీవుడ్ కార్మికులందరూ షారూఖ్, అమీర్, సల్మాన్, రణబీర్ తదితరులకు పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్ నుండి భారీ అభిమానులు ఉన్నారు. గల్ఫ్ దేశాలలో భారీ పెట్టుబడులు పెట్టారు. భారత జాతీయవాదులు తమకు లేదా వారి వ్యాపార ప్రయోజనాలకు ఎటువంటి హాని చేయరని వారికి తెలుసు. వారు మన దేశాన్ని పట్టించుకోరు..!! అని నెటిజన్ వారి మౌనం వెనక కారణాలను విశ్లేషించాడు. ఏది ఏమైనా కానీ, కాల్పుల విరమణ తర్వాత సల్మాన్ ఊపిరి పీల్చుకోవడం ఎవరికీ నచ్చలేదు. తప్పును తప్పు అని ఖండించకపోవడంపై చాలా మంది గుర్రుగా ఉన్నారు. భారతదేశం సల్మాన్ ఖాన్ను బహిష్కరించాలి అని ఒక నెటిజన్ తీవ్రంగా వ్యాఖ్యానించాడు. భాయ్ చుప్ రహో కరో కభీ కభీ అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.