Begin typing your search above and press return to search.

బెంగళూరులో 'సలార్‌' విజయోత్సవం..!

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 9:14 AM GMT
బెంగళూరులో సలార్‌ విజయోత్సవం..!
X

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.750 కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు విజయానందంలో ఉన్నారు.

తాజాగా బెంగళూరు లో సినిమా యూనిట్ సభ్యులు అంతా కూడా కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ శృతి హాసన్‌, శ్రేయా రెడ్డి, ఈశ్వరి రావు, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నిర్మాతలు ఇతర టెక్నీషియన్స్ పాల్గొన్నారు.

భారీ బడ్జెట్‌ తో సినిమా ను రూపొందించినా కూడా నిర్మాతకు భారీ గా లాభాలు దక్కాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరో వైపు సోషల్‌ మీడియాలో మాత్రం సలార్ ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్‌ ను చేరుకోలేదు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

సలార్‌ మొదటి పార్ట్‌ సూపర్‌ హిట్ అయిన నేపథ్యం లో రెండో పార్ట్‌ అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. గతంలో కేజీఎఫ్‌ 1 కి రెండు మూడు రెట్ల యాక్షన్ తో కేజీఎఫ్‌ 2 ను దర్శకుడు ప్రశాంత్‌ నీల్ రూపొందించాడు. అందుకే సలార్ 2 విషయంలో కూడా అలాగే జరుగుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. 2025 లో సలార్‌ 2 వస్తుందేమో చూడాలి.