Begin typing your search above and press return to search.

సలార్ సీక్వెల్‌ టైటిల్.. రోమాలు నిక్కబొడిచేలా..

ఈ సినిమా మొద‌టి పార్ట్‌కు పార్ట్ 1 సీజ్ ఫైర్ అని టైటిల్ పెట్టిన ప్ర‌శాంత్.. సలార్ పార్ట్ 2కు శౌర్యాంగ పర్వంగా టైటిల్ ఫిక్స్ చేశారు.

By:  Tupaki Desk   |   22 Dec 2023 9:15 AM GMT
సలార్ సీక్వెల్‌ టైటిల్.. రోమాలు నిక్కబొడిచేలా..
X

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సలార్ మేనియా నడుస్తోంది. రిలీజైన అన్ని థియేటర్లో ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్థ‌రాత్రి నుంచి ప్రీమియర్స్, బెనిఫిట్ షోలతో థియేటర్లు మార్మోగిపోతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు.

అయితే ఈ సినిమా ఎండింగ్లో ప్ర‌భాస్ అభిమానుల‌కు ఒక సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన నీల్.. క్లైమాక్స్ చివరలో అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా మొద‌టి పార్ట్‌కు పార్ట్ 1 సీజ్ ఫైర్ అని టైటిల్ పెట్టిన ప్ర‌శాంత్.. సలార్ పార్ట్ 2కు శౌర్యాంగ పర్వంగా టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ టైటిల్ ఇప్పుడు సలార్ పార్ట్-2పై అంచనాలు ఓ రేంజ్లో పెంచేసింది. ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవ, వ‌ర‌దలు శ‌త్రువులుగా ఎలా మారారో నీల్ ఇందులో చూపించ‌బోతున్నారు. ఈ మూవీ రిలీజ్ తేదీని మాత్రం ప్రశాంత్ నీల్ ప్రకటించలేదు. అయితే ఈ సినిమా 2024 డిసెంబ‌ర్‌ లేదా 2025 స్టార్టింగ్లో రిలీజ్ రానున్న‌ట్లు స‌మాచారం. ఇప్పుడు పార్ట్ 2 టైటిల్ శౌర్యాంగ పర్వం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

అయితే సలార్ పార్ట్ 1 కాస్త స్లో ప్రారంభమైనప్పటికీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఆడియన్స్ కనీసం సీట్లలో కూర్చోవడం కూడా కష్టమని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రభాస్ ఉగ్ర రూపం పీక్స్లో ఉందని అంటున్నారు. క్లైమాక్స్ కూడా అదిరిపోయిందని, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ను కొనియాడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా సలార్ చిత్కకొట్టేసిందని ట్వీట్లు చేస్తున్నారు.

రూ.400కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది. షారుక్ ఖాన్ నటించిన డంకీ విడుదలైన మరుసటి రోజే రిలీజైన ఈ మూవీ భారీ వసూళ్లు సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డంకీ తొలి రోజు వసూళ్లను సలార్ ఈజీ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

హొంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, స్టార్ హీరోయిన్ శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో రానుందని ప్రచారం జరుగుతోంది.