Begin typing your search above and press return to search.

సలార్ ఆగమనం అప్పుడే.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ చేయాలని కొత్త డేట్ ఫిక్స్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 8:17 AM GMT
సలార్ ఆగమనం అప్పుడే.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రాలలో సలార్ ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి భాగాన్ని ఈ సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయనున్నట్లు ఎప్పుడో ఏడాది క్రితమే అనౌన్స్ చేశారు మేకర్స్. అభిమానులు కూడా రిలీజ్ పక్కాగా అవుతుందని గట్టిగా భావించారు. కానీ విడుదలకు మరో నెల రోజులు ఉందనగా మేకర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు తాజాగా కొత్త రిలీజ్ డేట్ గురించి టాక్ వినిపిస్తోంది. దాదాపు ఇదే కన్ఫామ్ అవ్వొచ్చని అంటున్నారు.

వివరాళ్లోకి వెళితే.. సలార్ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు విషయంలో ప్రశాంత్ నీల్ సంతృప్తిగా లేరని, డిజిటల్ రైట్స్ విక్రయాలు జరగలేదని.. వాయిదా ప్రచారంలో రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై నిర్మాణ సంస్థ స్పందించకపోవడంతో మొదట అభిమానులు కాస్త ఆశ పెట్టుకున్నారు. సెప్టెంబర్ 28నే సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు రూల్స్ రంజన్ సహా ఇతర సినిమాలు సెప్టెంబర్ 28 రిలీజ్ కు డేట్ కన్ఫామ్ చేసుకోవడంతో సలార్ పోస్ట్ పోన్ క్లారిటీ అయిపోయింది.

దీంతో సలార్ మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూడటం మొదలు పెట్టారు అభిమానులు. కనీసం కొత్త డేట్ అయినా చెప్పాలని మేకర్స్ ను సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. కానీ ప్రొడక్షన్ హౌస్ మాత్రం అస్సలు స్పందించట్లేదు.

అయితే దీపావళికి లేదా క్రిస్మస్ సమయంలో సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని మేకర్స్ ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ చేయాలని కొత్త డేట్ ఫిక్స్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

అంటే దీపావళి బరిలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ డేట్ ను అయినా మేకర్స్ లాక్ చేస్తారో.. లేదో చూడాలి. ఫ్యాన్స్ అయితే ఈ వార్త తెలుసుకుని కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వీలైనంత త్వరగా సినిమా రావాలని గట్టిగా కోరుకుంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్, టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతిబాబు.. ప్రతినాయకులుగా నటించారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో పక్కా యాక్షన్ మూవీగా నిర్మించింది. కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో సినిమాపై ఊహించని రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ గూస్ బంప్స్ తెప్పించేసింది.