Begin typing your search above and press return to search.

'సలార్‌' మేకర్స్ కఠిన నిర్ణయం

ట్రైలర్‌ రిలీజ్ అయ్యే వరకు చిత్ర యూనిట్ సభ్యుల్లో ఏ ఒక్కరు మీడియా ముందుకు వెళ్లకూడదు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 4:59 AM GMT
సలార్‌ మేకర్స్ కఠిన నిర్ణయం
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు టీజర్ కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కేజీఎఫ్‌ 2 తరహాలోనే సలార్‌ 1 కచ్చితంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను మేకర్స్ తో పాటు సినీ ప్రేమికులు నమ్మకంగా ఉన్నారు.

సలార్‌ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో యూనిట్ సభ్యులు మీడియా ముందుకు వచ్చి సినిమా విశేషాలను వెల్లడిస్తూ అంచనాలు పెంచుతారని అంతా భావిస్తూ ఉన్న సమయంలో అనూహ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు కఠిన నిర్ణయం తీసుకుని అందరికి షాక్ ఇవ్వడం జరిగింది.

ట్రైలర్‌ రిలీజ్ అయ్యే వరకు చిత్ర యూనిట్ సభ్యుల్లో ఏ ఒక్కరు మీడియా ముందుకు వెళ్లకూడదు. ఒక వేళ మీడియాతో ఇంట్రాక్ట్‌ అయినా కూడా సలార్ కు సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా చెప్పకూడదు. హీరో, దర్శకుడు, హీరోయిన్‌ ఇలా ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి సలార్‌ గురించి మాట్లాడకూడదు అంటూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

సలార్‌ లో కేజీఎఫ్‌ లింక్స్ ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా సలార్‌ ప్రమోషన్ లో భాగంగా రివీల్ అవ్వకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. మొత్తానికి సలార్ మేకర్స్ చాలా రహస్యంగా ఉంచేందుకు గాను ప్లాన్‌ చేస్తున్నారు. ఎంత సీక్రెట్ మెయింటెన్ చేసినా కూడా ఆ సమయానికి అంతా బహిరంగమే.

సలార్ ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి భాగంను సలార్‌ ఛాప్టర్ 1 గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక రెండవ చాప్టర్ ను వచ్చే ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. కన్నడ సినిమా కేజీఎఫ్‌ ను పాన్‌ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయ్యేలా చేసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ ను అంతకు మించి అన్నట్లుగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.