Begin typing your search above and press return to search.

సలార్ ఫోర్ పిల్లర్స్.. వారి సూపర్ క్వాలిటీస్ ఇవే!

తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

By:  Tupaki Desk   |   25 Dec 2023 11:58 AM GMT
సలార్ ఫోర్ పిల్లర్స్.. వారి సూపర్ క్వాలిటీస్ ఇవే!
X

కేజీఎఫ్ రెండు పార్ట్లతో క్రేజ్ సంపాదించిన ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నార్త్ లో అయితే భారీ వసూళ్లు రాబడుతోంది. క్రిస్మస్ హాలిడేస్ నేపథ్యంలో సలార్ వసూళ్లలో ఒక్కసారిగా 25 శాతానికిపైగా పెరిగినట్లు తెలుస్తోంది.


ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది అభిమానులు సలార్ సినిమాను చూసేశారు. మరికొందరు రిపీట్ మోడ్ లో డార్లింగ్ మాస్ యాక్షన్ ను చూసేందుకు మళ్లీ మళ్లీ వెళ్తున్నారు. ఇంకొందరు మూవీని చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ఈ మల్టీప్లెక్స్ లో సలార్ సినిమా ప్రదర్శితమవుతోంది. ఏఎంబీ యాజమాన్యం సోషల్ మీడియాలో ఫుల్ టచ్ లో ఉంటుంది. పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా సలార్ మూవీలోని మెయిన్ రోల్స్ పోషించిన నలుగురి ఫొటోలను షేర్ చేస్తూ వారి బలబలాలను పంచుకుంది.


ప్రతి ఒక్కరికి సొంత బలం ఉంటుందని తన పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చింది. సినిమాలో ముఖ్యపాత్రలు పోషించిన ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ప్రశాంత్ నీల్ ఫొటోలను షేర్ చేసింది ఏఎంబీ సినిమాస్. ఫస్ట్ ముగ్గురు స్క్రీన్పై నటించగా.. చివరి ప్రశాంత్ నీల్ తెర వెనుక ఉండి మొత్తం నడిపించారు. అయితే ఈ నలుగురిలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే?


సినిమాలో దేవరథగా కనిపించిన ప్రభాస్ ను ఆయుధాలు బాగా ఉపయోగించే వ్యక్తిగా, అనంతమైన దృఢత్వం కలిగిన వ్యక్తిగా వర్ణించింది. మూవీలో వరదరాజ మన్నార్ గా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ మాస్టర్ మైండ్ అని, అతడి బలం దేవ అని చెప్పింది. మరో కీలకపాత్ర రాజ మన్నార్ గా కనిపించిన జగపతిబాబు ఎత్తుపై ఎత్తు వేసే వ్యక్తి అని, అతడి బలం ఖాన్సార్ రాజ్యమేనని తెలిపింది. చివరగా ప్రశాంత్ నీల్.. స్టోరీ నరేషన్ లో నిష్ణాతుడు అని, సృజనాత్మక నైపుణ్యం కలిగిన వ్యక్తిగా వర్ణించింది.


వీటితోపాటు మరో పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాకు వెళ్లే మందు రెండు తెగల కోసం తెలుసుకోండంటూ ప్రముఖ సినీ వెబ్ సైట్ షేర్ చేసింది. అందులో సినిమాలోని మన్నార్సి, ఘనియార్ తెగలకు చెందిన వారి పేర్లతో పాటు ఫొటోలను పోస్ట్ చేసింది.

మన్నార్సి తెగలో రాజమన్నార్ గా జగపతి బాబు, రాధారమగా శ్రియా రెడ్డి, వరదగా పృథ్వీరాజ్ సుకుమారన్, రుద్రగా రామచంద్ర రాజు, ఓంగా దేవరాజు, బాచిగా ప్రమోద్ నటించారు. మరోవైపు, ఘన్సార్ తెగలో నారంగ్ గా చౌదరీ, వాలిగా బ్రహ్మజీ, రంగాగా జాన్ విజయ్, విష్ణుగా వజ్రంగ్, చీకా గా శౌరవ్ లోకేశ్ యాక్ట్ చేశారు.

ఈ ఫొటలన్నింటినీ హోంబలే ఫిల్మ్ రీషేర్ చేసింది. దీంతో ఒక్కసారి ఫుల్ ట్రెండింగ్ లోకి మారాయి ఆ పిక్స్. సలార్ ఫోర్ పిల్లర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.