Begin typing your search above and press return to search.

లియో రికార్డ్ బ్రేక్ చేసే సత్తా సలార్ కు లేదా

దీంతో ప్రపంచ దేశాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   8 Dec 2023 3:15 AM GMT
లియో రికార్డ్ బ్రేక్ చేసే సత్తా సలార్ కు లేదా
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా డార్లింగ్ మాస్ యాక్షన్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.

అయితే ఇప్పుడు నెట్టింట కొత్త చర్చ మొదలైంది. దళపతి విజయ లేటెస్ట్ మూవీ లియో ఓవర్సీస్ ఓపెనింగ్స్ ను సలార్ బ్రేక్ చేసే అవకాశాలు లేవంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అందుకు రకరకాల కారణాలను చెబుతున్నారు. సలార్ విడుదల వాయిదాకు ముందుతో పోలిస్తే ఇప్పుడు సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ తగ్గిందని అంటున్నారు. అందుకే బాహుబాలి 2, ఆర్ఆర్ఆర్, లియో రేంజ్లో ఓవర్సీస్ ఓపెనింగ్స్ జరగకపోవచ్చని చెబుతున్నారు.

వాస్తవానికి.. ఓవర్సీస్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లియో మూవీ 8.1మిలియన్ల ఓపెనింగ్స్ సాధించింది. అంత మొత్తంలో తొలి రోజు వసూలు చేసి కోలీవుడ్ తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. నాన్ రాజమౌళి సినిమా రికార్డ్ ఓపెనర్ గా నిలిచింది. బాహుబలి-2.. 10 మిలియన్లకు తొలిరోజు వసూలు చేయగా.. ఆర్ఆర్ఆర్ 8.5 మిలియన్లు రాబట్టింది.

అయితే ప్రభాస్ సలార్ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్ 21న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన డుంకీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షారుక్ గత రెండు చిత్రాలు వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన నేపథ్యంలో ఈ చిత్రం పై కూడా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ రాజ్‌ కుమార్ హీరాని దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు మరిన్ని పెరిగాయి. దీంతో సలార్ కు డుంకీ కచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందని సినీ వర్గాల్లో టాక్. ఆ ప్రభావం కూడా సలార్ ఓపెనింగ్స్ పై పడుతుంది

ఇక సలార్ విషయానికొస్తే.. ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత ఫుల్ యాక్షన్ రోల్లో కనిపించనున్నారు. డార్లింగ్ సరసన శ్రుతిహాసన్ కనిపించనుంది. ఈ చిత్రంతో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటితే ట్రైలర్ రిలీజ్ కాగా.. త్వరలోనే మరో ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదలు చేయునుందని సమాచారం.