Begin typing your search above and press return to search.

భోళా రెమ్యునరేషన్​ గొడవ.. అసలు క్లారిటీ ఇచ్చేశాడు

అయితే తాజాగా ఈ విషయమై చిరంజీవి వీరాభిమాని, రీసెంట్​గా బ్లాక్ బస్టర్ హిట్​ అందుకున్న బేబీ దర్శకుడు ​ సాయి రాజేశ్​ స్పందించారు.

By:  Tupaki Desk   |   14 Aug 2023 10:24 AM GMT
భోళా రెమ్యునరేషన్​ గొడవ.. అసలు క్లారిటీ ఇచ్చేశాడు
X

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' భారీ డిజాస్టర్​ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు ఎంపిక, సినిమా కథ,కథనంపై భారీగా విమర్శలు వస్తున్నాయి. అయితే దీంతో పాటే ఎవరూ ఊహించని ఓ రూమర్ కూడా ఒకటి వస్తోంది. అదేంటంటే.. 'భోళా శంకర్' ఫలితం వచ్చాక.. ఈ చిత్రం రిలీజ్​కు ముందు నిర్మాత అనిల్ సుంకర ముక్కు పిండి మరీ చిరంజీవి తన రెమ్యునరేషన్​ను వసూలు చేశారని అంటున్నారు.

దీంతో సోషల్ మీడియా అంతా ఇదే ప్రచారం గట్టిగా సాగుతోంది. నిర్మాత అనిల్ సుంకర.. చిరు పారితోషికాన్ని తీర్చేందుకు ఎక్కడెక్కడో ఉన్న తన ప్రాపర్టీస్​, ల్యాండ్.. ఇంకా మరెవో తాకట్టు పెట్టీ మరీ వాటిని తీర్చారని చెబుతున్నారు. చిరంజీవి ఇమేజ్​ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయమై చిరంజీవి వీరాభిమాని, రీసెంట్​గా బ్లాక్ బస్టర్ హిట్​ అందుకున్న బేబీ దర్శకుడు ​ సాయి రాజేశ్​ స్పందించారు.

ఈ విషయమై చాలా క్లియర్​గా సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇకనైనా చిరంజీవిపై ఆరోపణలు చేయడం ఆపండి, సినిమా బాగోలేకపోతే బాగోలేదు అని మాత్రమే చెప్పండి.. అంతే కానీ అందులో నటించిన చిరంజీవిపై ఇష్టమొచ్చినట్లు ఏది పడితే అది రాయకండి అంటూ గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అందరీపై భారీగా మండి పడ్డాడు.

నిజం చెప్పులేసుకునేలోపు అబద్దం ఊరంతా చుట్టేస్తోంది. ఇంకో వారం రోజులపాటు చిరంజీవి ముక్కుపిండి నిర్మాత నుంచి పారితోషికాన్ని ఎలా వసూలు చేసారో అనేది రకరకాల వార్తలు వస్తాయి. ఇటు పక్క ఎలాగో నిజం చెప్పే మనిషి ఉండడు. మేము మెగాస్టార్ చిరు ఆఫీస్​లో ఉన్నప్పుడు అనిల్ సుంకర వస్తే ఆయన్ను వెయిట్ చేయించొద్దని స్టాఫ్​తో చెప్పి.. పైకి రాగానే ఆయనే ఐరెన్ సోఫా జరిపి అనిల్​సుంకరను కూర్చోబెట్టారు.

పని మనిషి తీసుకొచ్చిన కాఫీని ఆయనే స్వయంగా మా ముగ్గురికి అందించారు. నిర్మాతలకి ఆయనిచ్చే మర్యాద అలాంటిది. ఈ వార్తలను చూసి చాలా బాధతో నేను అనిల్ సుంకర దగ్గర పని చేసే ఒక వ్యక్తికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నాను. మా బాస్ మీరనుకున్నట్లుగా కాదు. ఆయన వేరే. మా బాస్ చిరంజీవి గారిని చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను అంటూ సాయి రాజేశ్​ చేసిన ఓ ట్వీట్ ఫుల్ వైరల్​గా మారింది.