Begin typing your search above and press return to search.

సాయి పల్లవి చేస్తున్నది బయోపిక్‌ మూవీనా?

లేడీ పవర్‌ స్టార్‌ అంటూ అభిమానులు పిలుచుకునే సాయి పల్లవి గత ఏడాది పెద్దగా సినిమాలు చేసిందే లేదు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 5:10 AM GMT
సాయి పల్లవి చేస్తున్నది బయోపిక్‌ మూవీనా?
X

లేడీ పవర్‌ స్టార్‌ అంటూ అభిమానులు పిలుచుకునే సాయి పల్లవి గత ఏడాది పెద్దగా సినిమాలు చేసిందే లేదు. అయితే ఈ ఏడాదిలో ఆమె బిజీ బిజీగా సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యింది. తెలుగు లో నాగ చైతన్యకు జోడీగా తండేల్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక తమిళంలో శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు కమిట్ అయ్యింది.

శివ కార్తికేయన్ హీరోగా కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్‌ పెరియసామి మరియు స్టీఫెన్ రిక్టర్‌ లు దర్శకత్వం వహించబోతున్నారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమా కథ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా దివంగత వీర జవాన్‌ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ నిజ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించబోతున్నారట. 2014 లో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో మేజర్ ముకుంద్ వీర మరణం పొందారు. ఆయనకు మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం అశోక్‌ చక్ర ను ప్రధానం చేయడం జరిగింది.

ఇప్పుడు మేజర్ ముకుంద్‌ పాత్ర కోసం శివ కార్తికేయన్ కసరత్తులు చేస్తున్నాడు. మేజర్ పాత్ర కోసం శివ కార్తికేయన్‌ గతంలో ఎప్పుడు లేనంతగా కష్టపడుతున్నాడు అంటూ ఆయన సన్నిహితులు సోషల్‌ మీడియా ద్వారా మాట్లాడుకోవడం జరిగింది.

SK21 అనే వర్కింగ్ టైటిల్‌ తో రూపొందబోతున్న ఈ సినిమా షూటింగ్ కు అంతా సిద్ధం అయ్యింది. సాయి పల్లవి తో పాటు పలువురు ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా మేజర్‌ ముకుంద్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు.

బయోపిక్ అయినప్పటికి కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో, నిజ జీవిత యదార్థ సంఘటనలు తీసుకుని కల్పిత పాత్రలతో కమర్షియల్ గా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమాని రూపొందించే విధంగా స్క్రిప్ట్‌ వర్క్ జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సాయి పల్లవి సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది కచ్చితంగా మంచి వార్తే అనడంలో సందేహం లేదు.