Begin typing your search above and press return to search.

ఇందుకే.. వెంకీ అంటే అంత ఇష్టపడతారు

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ ఎక్కువ శాతం విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకే ఆసక్తి చూపుతూ ఉంటారు

By:  Tupaki Desk   |   11 Jan 2024 5:30 PM GMT
ఇందుకే.. వెంకీ అంటే అంత ఇష్టపడతారు
X

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ ఎక్కువ శాతం విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకే ఆసక్తి చూపుతూ ఉంటారు. అది షూటింగ్లో కావచ్చు, బయట కావచ్చు. కానీ కొద్దిమంది హీరోలు మాత్రమే విలాసవంత జీవితాలకు దూరంగా ఉంటూ సామాన్యుల వలే ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ సైతం అదే చేశారు. వెంకీ మామ సింప్లిసిటీకి మీడియా వాళ్లు ఫిదా అయిపోయారు.

ఈ సంక్రాంతికి వెంకటేష్ 'సైంధవ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ జోష్ తో పాల్గొంటున్నారు వెంకటేష్. సినిమా టీజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఈవెంట్లో వెంకటేష్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా తన చలాకితనంతో ఆకట్టుకుంటున్నారు.

మామూలుగా బయట ఈవెంట్స్ లో కానీ, మీడియా మీట్స్, ప్రెస్ కాన్ఫరెన్స్ లలో స్టార్ హీరోల కోసం వాళ్లకు కూర్చునేందుకు కంఫర్టబుల్గా ఉండే ప్రత్యేక కుర్చీలను అరెంజ్ చేస్తూ ఉంటారు. తాజాగా సైంధవ్ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ మీడియా మీట్ కి వెళ్ళినప్పుడు కూడా ఆయన కోసం ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారు. మీడియా వాళ్ళు నార్మల్ చైర్స్ లో కూర్చుంటే వెంకటేష్ కోసం స్పెషల్ చైర్ ఏర్పాటు చేశారు. కానీ వెంకటేష్ దాన్ని ఇగ్నోర్ చేసాడు.

ఆ ప్రత్యేక కుర్చీ పట్ల వెంకటేష్ వ్యవహరించిన తీరు మీడియా వాళ్ళని షాక్ కి గురి చేసింది. ఆ కుర్చీని చూసిన వెంకటేష్.." ఇది నాకు అక్కర్లేదు. ఈ కూర్చుని తీసేసి మీడియా వాళ్ళు కూర్చున్న నార్మల్ చేయిర్ నాకు ఇవ్వండి" అంటూ తన టీం కి చెప్పాడు. దాంతో వెంకటేష్ కోసం సాధారణ కూర్చుని ఏర్పాటు చేశారు. ఇది చూసిన మీడియా వాళ్ళు వెంకీ మామ సింప్లిసిటీ కి ఫిదా అయిపోయారు. ఇతర హీరోలు ఇప్పటివరకు ఇలా చేసింది లేదు.

ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మిగతా హీరోల కంటే తాను చాలా డిఫరెంట్ అని నిరూపించుకున్నారు ఈ సీనియర్ హీరో. ఇక సైంధవ్ విషయానికి వస్తే.. చాలాకాలం తర్వాత మళ్లీ వెంకీ ఇందులో యాక్షన్ అవతార్ లో కనిపించనున్నారు. వెంకటేష్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.