Begin typing your search above and press return to search.

8 పాత్ర‌ల‌తోనే సైంధ‌వ్ థ్రిల్ చేస్తుందా?

ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నాడు? ఎలాంటి క్రైమ్ ని ఆవిష్క‌రించ‌బోతున్నాడు? అని థ్రిల్ల‌ర్ ఫ్యాన్ప్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు

By:  Tupaki Desk   |   11 Sep 2023 6:30 AM GMT
8 పాత్ర‌ల‌తోనే సైంధ‌వ్ థ్రిల్ చేస్తుందా?
X

క్రైమ్ థ్రిల్ల‌ర్ హిట్ ప్రాంచైజీతో శైలేష్ కొల‌ను త‌న‌కంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. న‌రాలు తెగే ఉత్కంఠ‌తో ఎంగేజ్ చేయ‌డంలో శైలేష్ నూరు శాతం స‌క్సెస్ అయ్యాడు. ఈ జాన‌ర్ సినిమాలు చేయాలంటే త‌న‌కే సాధ్య‌మ‌ని నిరూపించాడు. అందుకే హిట్‌-3 లో న‌టించే ఛాన్స్ మ‌రెవ్వ‌రికీ ఇవ్వ‌కుండా నేచుర‌ల్ స్టార్‌ నాని తీసుకున్నాడు. ఇప్ప‌టికే పార్ట్-3 ప్రీ టీజ‌ర్ కూడా రిలీజ్ చేసిన సంగ‌తి విధిత‌మే. ఈ నేప‌థ్యంలో శైలేష్ తెర‌కెక్కిస్తోన్న 'సైంధ‌వ్' పై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి.

ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నాడు? ఎలాంటి క్రైమ్ ని ఆవిష్క‌రించ‌బోతున్నాడు? అని థ్రిల్ల‌ర్ ఫ్యాన్ప్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఇది క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ్రీలంక‌లో జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.

ఈ సినిమా ప్ర‌ధానంగా ఎనిమిది పాత్ర‌ల చుట్టూనే తిరుగుతుందిట‌. ఎనిమిది పాత్ర‌లు సినిమాలో చాలా కీల‌కం అని అంటున్నారు. క‌థ మొద‌లు నుంచి ముగింపు వ‌ర‌కూ క్రైమ్ కి కార‌కులు ఎవ‌రు? అన్న‌ది ఎంతో ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తున్న‌ట్లు స‌మాచారం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగుతుందిట‌. లోకేష‌న్లు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని క‌లిగిస్తాయ‌ని యూనిట్ చెబుతుంది.

ప్ర‌స్తుతం శ్రీలంక షెడ్యూల్ లో భాగంగా వెంక‌టేష్ తో పాటు ఇత‌ర న‌టీన‌టుల‌పై కీల‌క పోరాట స‌న్నివేశా లు..ఓ పాట చిత్రీక‌రిస్తున్నారుట‌. ఇవి సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని అంటున్నారు. న‌వాజుద్దీన్ పాత్ర కృరంగా ఉంటుంద‌ని స‌మాచారం. అలాగే వెంక‌టేష్ పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంద‌ని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు గానీ...పాత్ర‌లు గానీ వెంకీ ఇంత‌వ‌ర‌కూ పోషించ‌లేదు. ఈ సినిమాతో ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ క్రియేట అవుతుంద‌ని తెలుస్తుంది. అలాగే వెంకీ కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం కావ‌డం విశేషం.