Begin typing your search above and press return to search.

మా విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: సైంధవి

అయితే వాటిలో కొన్ని మరీ బాధాకరంగా ఉండడం వల్ల సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే జీవీ ప్రకాష్ స్పందించారు.

By:  Tupaki Desk   |   18 May 2024 5:06 AM GMT
మా విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: సైంధవి
X

కోలీవుడ్ లో స్టార్ కపుల్ ‏గా ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి విడాకుల విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడమేంటని చాలా మంది నెటిజన్లు షాకయ్యారు. మరికొందరు వీరి విడాకులకు కారణాలు ఇవేనని రకరకాల పోస్టులు పెట్టారు. ఇంకొందరు నెట్టింట ట్రోల్స్ చేశారు.

అయితే వాటిలో కొన్ని మరీ బాధాకరంగా ఉండడం వల్ల సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే జీవీ ప్రకాష్ స్పందించారు. తమ వ్యక్తిగత జీవితాల గురించి దిగజారి మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సైంధవి కూడా ట్రోల్స్ పై స్పందించింది. తమ గురించి వస్తున్న కామెంట్స్ చాలా దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇంకా నెట్టింట ట్రోల్స్ ఆగలేదు. దీంతో మరోసారి సైంధవి స్పందించింది.

తమ విడాకుల వ్యవహారంలో ఎవరి జోక్యం లేదని స్పష్టం చేసింది సైంధవి. తమ వ్యక్తిగత విషయంలో ఎవరూ తలదూర్చొద్దని ఆమె కోరింది. పలు యూట్యూబ్‌ ఛానెళ్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా ఆవేదన కలిగిస్తోందని చెప్పింది. ఇద్దరి భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పాఠశాల నుంచి తాను, జీవీ 24 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నామని చెప్పింది. విడిపోయిన తర్వాత కూడా స్నేహం కొనసాగుతుందని సైంధవి పోస్ట్ పెట్టింది.

అయితే ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ మేన‌ల్లుడే జీవీ ప్ర‌కాష్‌. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌కంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. సంగీత ద‌ర్శ‌కుడిగా నేష‌న‌ల్ అవార్డు కూడా అందుకున్నారు. 2013లో త‌న చిన్న‌నాటి స్నేహితురాలు గాయ‌ని సైంధ‌విని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు వారిద్దరి మధ్య 11 ఏళ్ల దాంపత్య జీవితం కొనసాగింది. వారి వివాహ బంధానికి గుర్తుగా కూతురు అన్వీ ఉంది.

ఇటీవల ప్రకాష్, సైంధవి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. మొత్తానికి కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇటీవ‌ల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. 18 ఏళ్ల పాటు అనోన్యంగా క‌లిసి ఉన్న ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య విడిపోవ‌డాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇప్పుడు జీవీ ప్రకాష్, సైంధవి కూడా విడాకులు తీసుకోవడంతో షాకవుతున్నారు.