Begin typing your search above and press return to search.

బీదర్ లో సైంధ‌వ్ పోరాటం!

తండ్రి-కుమార్తె సెంటిమెంట్ ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తున్న‌ట్లు యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది.

By:  Tupaki Desk   |   23 Aug 2023 3:02 PM GMT
బీదర్ లో సైంధ‌వ్ పోరాటం!
X

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్' సైంధ‌వ్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ మొద‌లైన నాటి సైంధ‌వ్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా చ‌క‌చ‌కా షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు.వెంకటేష్ నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త యాక్షన్ పాత్రలో క‌నిపంచ‌నున్నారు. న‌వాజుద్దీన్ సిద్దిఖి లాంటి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌తినాయ‌కుడు పాత్ర పోషించ‌డం అద‌న‌పు అస్సెట్. సైంధ‌వ్-సిద్దిఖిల మ‌ధ్య యాక్ష‌న్ అంశాలు ప్ర‌ధానంగా హైలైట్ కానున్నాయి.

ఇప్ప‌టికే హైదరాబాద్...వైజాగ్ లాంటి ప్ర‌దేశాల్లో కీల‌క షెడ్యూల్స్ పూర్తిచేసారు. తాజాగా కొత్త షెడ్యూల్ క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్ లో జ‌రుగుతున్న‌ట్లు తెలిసింది. వెంకటేశ్ పై పోరాట సన్నివేశాలను చిత్రీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక్క‌డే కొన్నిథ్రిల్ల‌ర్ అంశాలకు ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. సైంధ‌వ్ బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్రచారంలో ఉంది. క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా మ‌లుస్తున్న‌ట్లు లీకులందుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజా షెడ్యూల్ కి- ఆస‌న్నివేశాల‌కి ఏదైనా సంబంధం ఉందా? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. తండ్రి-కుమార్తె సెంటిమెంట్ ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తున్న‌ట్లు యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది.

కానీ బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ ని మాత్రం రివీల్ చేయ‌లేదు. ఇది రివీల్ చేయాల్సిన అంశం కూడా కాదు. ఈ నేప‌థ్యంలో ఆ కాన్సెప్ట్ ని హైడ్ చేసే అవ‌కాశం ఉంది. ఆ థ్రిల్ ఎలా ఉంటుంద‌న్న‌ది నేరుగా థియేట‌ర్లోనే ఆస్వాదించాలి.

తాజా షెడ్యూల్ కి ఆ లింక్ ఉందా? అన్న‌ది తెలియాలి. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. వెంక‌టేష్ కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. ఇందులో వెంకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్, రుహాణి శర్మ, ఆండ్రియా న‌టిస్తున్నారు. ఈ మూడు పాత్ర‌లు కూడా సినిమాలో ప్ర‌ధానంగా హైలైట్ కానున్నాయి. కేవ‌లం రోమాన్స్ కే ప‌రిమితం కాకుండా క‌థ‌లో సాగే పాత్ర‌లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాకి మంచి బ‌జ్ ని తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే.