Begin typing your search above and press return to search.

పెళ్లి చేసుకుంటే ప‌రిస్థితి ఇలా ఉంటుంది బ్రో!

ఆ ఫోటోని ఉద్దేశించి సాయి తేజ్ డైరెక్ట్ గా కామెంట్ చేయ‌లేదుగానీ ప‌రోక్షంగా మాత్రం పెళ్లి చేసుకుంటే భ‌ర్త‌ల ప‌రిస్థితి ఇలా ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 10:05 AM GMT
పెళ్లి చేసుకుంటే ప‌రిస్థితి ఇలా ఉంటుంది బ్రో!
X

మెగా ఫ్యామిలీలో త‌దుప‌రి పెళ్లి కొడుకోలు ఎవ‌రంటే? సాయితేజ్..వైష్ణ‌వ్ తేజ్..అల్లు శిరీష్ లే క‌నిపిస్తు న్నారు. ఈ ముగ్గ‌రు పెళ్లికి రెడీ గా ఉన్నారు. అందులో సాయితేజ్ క్యూలో ముందున్నాడు. వరుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠిని వివాహం చేసుకోవ‌డంతో తేజ్ పేరు జోరుగా వినిపిస్తుంది. భాజాలు మోగించ‌డానికి రెడీగా ఉన్న స్టార్ అంటూ అభిమానులు ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేస్తుంటారు. కానీ తేజ్ వైఖ‌రి చూస్తుంటే పెళ్లిచేసుకునే ట‌ట్లు క‌నిపించ‌లేదండోయ్.

పెళ్లి చేసుకున్న వారంద‌ర్నీ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేసి పెళ్లిపై త‌న అభిప్రాయాన్ని చెప్ప‌క‌నే చెబుతున్నారు. వరుణ్ తేజ్ పెళ్లి మీద తేజ్ చేసిన కామెంట్లు.. ఆ పోస్ట్ మీద నెటిజన్లు వేసిన సెటైర్లు అందరికీ తెలిసిందే. ఎంత పని చేశావ్ రా అంటూ వరుణ్ పెళ్లి మీద తేజ్ ఫన్నీగా కామెంట్లు చేశాడు. దీంతో నెటి జ‌నులు నెక్స్ట్ నువ్వేగా? అంటూ ఆట‌ప‌ట్టించారు. తాజాగా మ‌రోసారి సాయితేజ్ సోలో లైఫే సో బెట‌ర్ అనే నినాదాన్ని అందుకున్నాడు.

తేజ్ త‌న ఖాతాలో తాజాగా త‌న స్నేహితులు భార్య‌భ‌ర్త‌లు ఉన్న ఫోటోని షేర్ చేసాడు. అంద‌రూ త‌న స్నేహితుల భార్య‌లు కుర్చీలో కుర్చుంటే...భ‌ర్త‌లు మాత్రం వాళ్ల కుర్చీల వెన‌కాల నుంచుని ఉన్నారు. తేజ్ మాత్రం వాళ్ల భార్య‌ల ప‌క్క‌న ఎంచ‌క్కా ద‌ర్జాగా కుర్చీ తిర‌గేసి కూర్చున్నాడు. ఆ ఫోటోని ఉద్దేశించి సాయి తేజ్ డైరెక్ట్ గా కామెంట్ చేయ‌లేదుగానీ ప‌రోక్షంగా మాత్రం పెళ్లి చేసుకుంటే భ‌ర్త‌ల ప‌రిస్థితి ఇలా ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు.

త‌నే చేతిని పైకి లేపు ..మూతి బిగించి ఇదండి పరిస్థితి అన్నాడు. ఈ పోస్ట్ మీద నెటి జ‌నులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నువ్వు సేఫ్ బ్రో..పెళ్లి చేసుకోలేదు. చేసుకున్న వాళ్లంద‌రి ప‌రిస్థితి అలాగే ఉంది. నిజం చెప్పావ్.. ఇంకా చాలా వాస్త‌వాలు చెప్పాలి. పెళ్లి క‌ష్ట సుఖాల గురించి కూడా షేర్ చేయాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అందుకే సోలో బతుకే సో బెటర్ అని మరో నెటిజన్.. సింగిల్ ఫర్ ఎవర్.. ఎంజాయ్ ఫర్ ఎవర్ అంటూ ఇలా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి తేజ్ మ‌రోసారి నెటి జ‌నుల్లో హాట్ టాపిక్ అయ్యాడు. ప్ర‌స్తుతం సాయితేజ్ ...సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో `గాంజా శంక‌ర్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `విరూపాక్ష` త‌ర్వాత తేజ్ న‌టిస్తోన్న చిత్ర‌మిది.