Begin typing your search above and press return to search.

ప‌వ‌నిజానికి 27 ఏళ్లు..మెగా హీరో ఎమోష‌న‌ల్ పోస్ట్‌

ప‌వ‌నిజం ఈ బుధ‌వారంతో 27 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయన మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 12:24 PM GMT
ప‌వ‌నిజానికి 27 ఏళ్లు..మెగా హీరో ఎమోష‌న‌ల్ పోస్ట్‌
X

వెండితెర‌పై త‌న‌దైన మార్కు హీరోయిజ‌మ్‌తో స్టార్ హీరోగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు ప‌వ‌ర్ స్టార్ గా కోట్లాది మంది ప్రేక్ష‌కహృద‌యాల్లో నిలిచిపోయారు వ‌వ‌న్‌ క‌ల్యాణ్. ఆయ‌న కెరీర్ ప్రారంభించి స‌రిగ్గా నేటికి 27 ఏళ్లు పూర్త‌వుతోంది. 1996లో మెగా ఫ్యామిలీ నుంచి అనుకోకుండా హీరోగా తెరంగేట్రం చేశారు ప‌వ‌న్‌. ఇ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీని బాలీవుడ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'ఖ‌యామ‌త్ సే ఖ‌యామ‌త్ త‌క్‌' ఆధారంగా రీమేక్ చేశారు.


తెలుగు నేటివిటీకి అనుగునంగా మార్పులు చేసి రీమేక్ చేసిన ఈ మూవీతో ప‌వ‌న్ 27 ఏళ్ల క్రితం హీరోగా అరంగేట్రం చేశారు. నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ యార్ల‌గ‌డ్డ ఇదే సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. 27 ఏళ్ల ప్ర‌యాణంలో ప‌వ‌న్‌కు 'సుస్వాగ‌తం', తొలి ప్రేమ‌, బ‌ద్రి, ఖుషి సినిమాలు స్టార్ డ‌మ్‌ని తెచ్చి పెట్టాయి. యూత్‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేశాయి. ఆ త‌రువాత స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ఫోన్ ప‌ట్టి చేసిన 'జానీ', వీర వంక‌ర్‌తో చేసిన 'గుడుంబా శంక‌ర్‌' వంటి డిజాస్ట‌ర్‌లు ఎదుర‌య్యాయి.

గెలుపు, ఓట‌ములు, స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఇమేజ్‌ని పెంచుకుంటూ పోయారు. ఫ్లాప్‌లు ఎదురైనా స‌రే ఆయ‌న మార్కెట్ చెక్కు చెద‌ర‌లేదంటే దానికి ఆయ‌న‌కున్న ఇమేజే ప్ర‌ధాన కార‌ణం.

ఈ ఇర‌వై ఏడేళ్లలో ప‌వ‌న్ 30 సినిమాల్లో న‌టించారు. 'గ‌బ్బ‌ర్ సింగ్‌'తో ప‌దేళ్ల విరామం త‌రువా బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌దైన మార్కు హీరోయిజంతో ఇప్ప‌టికీ అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతున్నారు.

ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌పై దృష్టి పెట్టిన ప‌వ‌న్ ఓ ప‌క్క క్రియాశీల రాజ‌కీయాల్లో యాక్టీవ్‌గా ఉంటూనే మ‌రో ప‌క్క త‌న అభిమానులని ఎంట‌ర్ టైన్ చేయ‌డం కోసం సినిమాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు', ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రాల‌లో న‌టిస్తున్నారు. ఇందుల‌లో ఓజీ, హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ప్రాజెక్ట్‌లు పాన్ ఇండియా సినిమాలు. ప‌వ‌నిజం ఈ బుధ‌వారంతో 27 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయన మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

'ఆయ‌న ఇంక్రిడిబుల్ జ‌ర్నీ 27 సంవ‌త్స‌రాలు బ‌లంగా మారింది. అంతే కాకుండా అచంచ‌ల‌మైన మ్యాజిక్ రాక్ సాలీడ్‌. దానికి సాక్ష‌మివ్వ‌డం, దానితో పాటు ఎదుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో స్క్రీన్ ను పంచుకోవ‌డం నాకు ద‌క్కిన గౌర‌వం. ఆయ‌న కీర్తి ప్ర‌కాశం, వ్య‌క్తిత్వం, శ‌క్తిని వ్య‌క్తిగ‌తంగా అనుభూతిని చెందండి. గ‌ర్వం, ప్రేమ‌తో మ‌న మంద‌రం అత‌ను వ‌న్ అండ్ ఓన్లీ ఓజీ' అని మేన మామ ప‌వ‌న్‌పై త‌నకున్న ప్రేమ‌ని ఎమోష‌న‌ల్ వ‌ర్డ్స్‌తో సాయి ధ‌ర‌మ్ తేజ్ వ్య‌క్తం చేసిన పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.