Begin typing your search above and press return to search.

వారిపై పరువు నష్టం దావాకి సిద్దమవుతున్న రైతు బిడ్డ?

తన పరువుకు భంగం కలిగించిన ప్రతి ఒక్క యూట్యూబ్‌ ఛానల్‌ పై, యూట్యూబర్స్ పై అలాగే కొన్ని మీడియా సంస్థలపై కూడా పల్లవి ప్రశాంత్ పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధం అవుతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 5:15 AM GMT
వారిపై పరువు నష్టం దావాకి సిద్దమవుతున్న రైతు బిడ్డ?
X

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన ఘర్షణలకు ప్రధాన ముద్దాయిగా అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ బెయిల్‌ రావడంతో జైలు నుంచి ఇంటికి చేరుకున్న విషయం తెల్సిందే. మీడియా ముందుకు రాకూడదు అనే కండీషన్ ఉండటంతో పల్లవి ప్రశాంత్‌ సైలెంట్‌ గా ఉన్నాడు.

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచిన సమయంలో కొందరు మీడియా వారు ఆయనను విమర్శిస్తూ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. పారి పోయాడు అని, మీడియా ను తిట్టాడు అని, ఫ్యాన్స్ ను తిట్టాడు అని, రెచ్చ గొట్టాడు అంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్ పల్లవి ప్రశాంత్ గురించి పతాక స్థాయిలో ప్రచారం చేశారు.

తన పరువుకు భంగం కలిగించిన ప్రతి ఒక్క యూట్యూబ్‌ ఛానల్‌ పై, యూట్యూబర్స్ పై అలాగే కొన్ని మీడియా సంస్థలపై కూడా పల్లవి ప్రశాంత్ పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధం అవుతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బెయిల్‌ కోసం లాయర్ లు చాలా మంది ఒక టీమ్‌ గా ఏర్పడి వాదించిన విషయం తెల్సిందే.

ఇప్పుడు అదే లాయర్ ల టీం అంతా కూడా పల్లవి ప్రశాంత్‌ తో పరువు నష్టం దావా వేయించేందుకు సిద్ధం అయ్యారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.