Begin typing your search above and press return to search.

త్రిషపై ఆ రూమర్స్ క్రియేట్ చేసింది ఎవరో..

ఒక్క ట్వీట్ తో తనపై పెళ్లిపై జరుగుతోన్న పుకార్లకి త్రిష పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 4:13 AM GMT
త్రిషపై ఆ రూమర్స్ క్రియేట్ చేసింది ఎవరో..
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల కెరియర్ పూర్తి చేసుకున్న అందాల భామ త్రిష. పొన్నియన్ సెల్వన్ సిరీస్ తర్వాత మరల త్రిషకి కోలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆమె చేతిలో లియో, అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఒకటి ఉన్నాయి. అలాగే మలయాళంలో కూడా ఓ భారీ బడ్జెట్ చిత్రంలో త్రిష కన్ఫర్మ్ అయ్యింది.

తెలుగులో ఓ సినిమా కోసం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే త్రిష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందని, మలయాళీ నిర్మాతని ఆమె పెళ్లాడబోతోంది అంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వీటిపై వెబ్ సైట్స్ కథనాలు కూడా ప్రముఖంగా పబ్లిష్ అయ్యాయి. త్రిష పెళ్లి వార్తలు విస్తృతంగా వ్యాపించడంతో ఆమె డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.

సోషల్ మీడియాలో దూరంగా ఉండే ఈ బ్యూటీ ట్విట్టర్( ఎక్స్) లో పోస్ట్ చేసింది. నువ్వు ఎవరో నాకు తెలుసు. నీ టీమ్ గురించి నాకు తెలుసు. ఇకనైనా పుకార్లుకి ఫుల్ స్టాప్ పెట్టి నిశ్శబ్దంగా ఉండూ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క ట్వీట్ తో తనపై పెళ్లిపై జరుగుతోన్న పుకార్లకి త్రిష పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది.

అయితే తనపై జరుగుతోన్న ఈ తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారనేది త్రిషకి బాగా తెలిసే ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆమె డైరెక్ట్ గా పెళ్లిపై వినిపిస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టకుండా. ఎవరు ఈ గాసిప్స్ స్ప్రెడ్ చేశారో వారిని పాయింట్ చేస్తూ పేరు మెన్షన్ చేయకుండా కామెంట్స్ చేసింది. దీనిని బట్టి ఆమె కెరియర్ ని నియంత్రించాలని చూసే వారు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అర్ధమవుతోంది.

అయితే ఆ రూమర్స్ స్ప్రెడ్ చేసింది ఎవరై ఉంటారా అనే ప్రశ్న ఇప్పుడు సౌత్ సర్కిల్ లో జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఫీమేల్ లీడ్స్ గా నయనతార, త్రిష టాప్ లో ఉన్నారు. వారి మధ్య ఏమైనా వైరం నడుస్తుందా అనే సందేహం కూడా కొత్తగా పుట్టుకొస్తోంది.