మంచు వర్సెస్ కంచు: ఎవరి బిందె లో నీళ్లు ఎక్కువ ?
సినీ నటి రోజా జబర్ధస్త్ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరించి బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 6 May 2025 11:24 AMసినీ నటి రోజా జబర్ధస్త్ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరించి బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఆ షోలో రోజా నాగబాబుతో కలిసి చేసిన సందడి అందరినీ అలరించింది. జబర్దస్త్ తో పాటూ ఆ టైమ్ లో పలు కార్యక్రమాలకు రోజా జడ్జ్ గా వ్యవహరించింది. రాజకీయాల్లో తాను పోటీ చేసిన ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ తర్వాత బిజీ అవడం, మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో టీవీ కార్యక్రమాలకు దూరమైన రోజా రీసెంట్ గా మళ్లీ టీవీ షో లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
జీ తెలుగులో డ్రామా జూనియర్స్ లో జడ్జిగా అలరిస్తున్న రోజా అప్పుడప్పుడు జీ తెలుగులో వచ్చే సూపర్ సీరియల్ చాంపియన్షిప్ లో కూడా కనిపించి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సూపర్ సీరియల్ చాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న సందర్భంగా మరోసారి రోజా ఈ ప్రోగ్రామ్కు వచ్చి సందడి చేసింది.
అయితే ఈ సారి రోజాతో పాటూ ఈ ప్రోగ్రామ్ కు మంచు లక్ష్మి కూడా హాజరై హంగామా చేసింది. తాజాగా ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో మంచు లక్ష్మి, రోజా ఇద్దరూ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి స్టేజ్ పైకి వచ్చారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య సాగిన సంభాషణ ప్రోమోకు హైలైట్ గా నిలిచింది.
స్టేజ్ పైకి వచ్చాక రోజా సమ్మర్ లో ఎండలకు ఏదైనా మంచు ప్రదేశానికి వెళ్దామనుకుంటే ఇక్కడికి వచ్చా అని మంచు లక్ష్మిని ఉద్దేశించి అనగా, ఆ తర్వాత మంచు లక్ష్మి పోటీలో ఎవరైనా కంచుగా ఉంటే బావుండనుకుంటే మీరు కలిశారని రోజాని ఉద్దేశించి కౌంటర్ వేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బోరింగ్ కొట్టి నీళ్ల బిందెను నింపే గేమ్ ఎంతో సరదాగా నవ్వులతో సాగింది. కార్యక్రమంలో వారిద్దరి మధ్య పోటీ మొత్తం మంచు వర్సెస్ కంచులా ఉంటుందని ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. ఎంతో సరదాగా సాగనున్న ఈ ఎపిసోడ్ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.