Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా డైరెక్టర్ తో రిషబ్.. ఆ రూమర్స్ కి చెక్..!

అయితే కె.జి.ఎఫ్ తో కన్నడ పరిశ్రమ క్రేజ్ ని నేషనల్ లెవెల్ లో నిలబెట్టిన ప్రశాంత్ నీల్ ఆ సినిమా తర్వాత వరుస తెలుగు సినిమాలు చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   2 March 2024 5:48 AM GMT
పాన్ ఇండియా డైరెక్టర్ తో రిషబ్.. ఆ రూమర్స్ కి చెక్..!
X

కె.జి.ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో సూపర్ పాపులర్ అయ్యాడు. కె.జి.ఎఫ్ రెండు భాగాలు హిట్ కొట్టాక ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేశాడు. సలార్ 1 కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజై సూపర్ హిట్ అయ్యింది. అయితే కె.జి.ఎఫ్ తో కన్నడ పరిశ్రమ క్రేజ్ ని నేషనల్ లెవెల్ లో నిలబెట్టిన ప్రశాంత్ నీల్ ఆ సినిమా తర్వాత వరుస తెలుగు సినిమాలు చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఈ విషయంలో కాంతారా హిట్ తర్వాత రిషబ్ శెట్టి తను హిట్ కొట్టా కదా అని ఎక్కడికో వెళ్లి సినిమాలు చేయనని.. తాను ఇక్కడే ఉండి సినిమాలు చేస్తానని అన్నాడు. అయితే రిషబ్ శెట్టి చేసిన ఆ కామెంట్స్ ప్రశాంత్ నీల్ ని దృష్టిలో ఉంచుకునే చేశాడని మీడియా వార్తలు రాసింది. కన్నడ పరిశ్రమలో హిట్ కొట్టి ఆ క్రేజ్ తో టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడని ప్రశాంత్ నీల్ పైనే రిషబ్ ఆ కామెంట్స్ చేశాడని.

తను కాంతారా తో నేషనల్ లెవెల్ లో సూపర్ హిట్ కొట్టినా తాను ఇక్కడే ఉండి సినిమాలు చేస్తానని అన్నారు. ఈ కామెంట్స్ కావాలని అన్నా అనకపోయినా కూడా రిషబ్ శెట్టి ప్రశాంత్ నీల్ మధ్య ఏదో జరుగుతుందని అనుకున్నారు. అయితే లేటెస్ట్ గా ఒక ఈవెంట్ లో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి కలిసి కనిపించారు. రిషబ్ కామెంట్స్ ని ప్రశాంత్ నీల్ కూడా లైట్ తీసుకున్నట్టు ఉన్నాడు. అందుకే ఇద్దరు వారి మధ్య ఎలాంటి గొడవ లేదన్నట్టుగా కనిపించారు.

కన్నడ పరిశ్రమలో జరిగిన ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా పాల్గొన్నాడు. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి, ఎన్.టి.ఆర్ దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్.టి.ఆర్ తో ఈ కన్నడ దర్శకులు ఇద్దరు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సలార్ 2 ని చేస్తున్నాడని తెలుస్తుండగా.. రిషబ్ శెట్టి కాంతారా ఫ్రీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం లో ఉన్నాడు. ఇక ఎన్.టి.ఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దేవర సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేసిన విషయం తెలిసిందే.