Begin typing your search above and press return to search.

సుశాంత్ ని జీవితాంతం మిస్ అవుతూనే ఉంటాను

తాజాగా రియా చక్రవర్తి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సుశాంత్ గురించి స్పందించింది. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను.

By:  Tupaki Desk   |   6 Oct 2023 10:14 AM GMT
సుశాంత్ ని జీవితాంతం మిస్ అవుతూనే ఉంటాను
X

బాలీవుడ్‌ యంగ్ స్టార్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్‌ మరణించి మూడేళ్లు కావస్తుంది. ఈ మూడు సంవత్సరాల్లో ఆయన గురించి రెగ్యులర్‌ గా ఏదో ఒక విషయమై చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పూత్‌ ప్రియురాలిగా పేరున్న రియా చక్రవర్తి గురించి రెగ్యులర్ గా ఏదో ఒక వార్త మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉండటం మనం చూస్తున్నాం.

ముఖ్యంగా సుశాంత్ చనిపోయిన సమయం లోనే రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం.. జైలుకు వెళ్లడం వంటివి జరిగింది. హీరోయిన్ గా కెరీర్ లో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటూ ఉన్న హీరోయిన్‌ రియా చక్రవర్తికి కెరీర్ లో పెద్ద డ్యామేజ్‌ గా సుశాంత్ మరణం నిలిచింది అనడంలో సందేహం లేదు.

సుశాంత్ మరణం కు పూర్తిగా రియా చక్రవర్తి కారణం అన్నట్టుగా చాలా మంది ఆరోపించారు. ఆ సమయంలో రియా చక్రవర్తి కనీసం బయటకు కూడా రాలేక పోయింది. సుశాంత్‌ చనిపోయిన చాలా రోజుల తర్వాత రియా మళ్లీ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్‌ చేయడం మొదలు పెట్టింది. అంతే కాకుండా ఆమె సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా రియా చక్రవర్తి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సుశాంత్ గురించి స్పందించింది. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను. ఆ బాధ నుంచి నేను జీవితాంతం బయటకు రాలేను. సుశాంత్ ని నేను జీవితాంతం మిస్ అవుతూనే ఉంటాను.

సుశాంత్ చనిపోయిన సమయంలో చాలా కథనాలు వచ్చాయి. వాటి వల్ల నేను చాలా మిస్ అయ్యాను. కనీసం నేను ఏడవడానికి కూడా సమయం ఇవ్వకుండా విమర్శలు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొంటూ వచ్చాను. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని నాకు తెలుసు.

ఈ సమయంలో నాకు ఆర్మీ ఆఫీసర్ అయిన మా నాన్న ఆదర్శం. ఆయన ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదుర్కొని నిలవాలని చెప్పేవారు. ఆయన చెప్పినట్లుగానే తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. హీరోయిన్‌ గా రియా చక్రవర్తి పూర్వ వైభవం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మరి అది ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.