Begin typing your search above and press return to search.

ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ మధ్య ఇంట్రస్టింగ్‌ రీ రిలీజ్ వార్‌

ఈ మధ్య కాలంలో తెలుగు తో పాటు తమిళ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ లు ఎక్కువగా అవుతున్నాయి. అయితే ఒకేసారి ఇద్దరు స్టార్‌ హీరోల రీ రిలీజ్ లు మాత్రం ఈ మధ్య కాలంలో కనిపించలేదు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 12:30 AM GMT
ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ మధ్య ఇంట్రస్టింగ్‌ రీ రిలీజ్ వార్‌
X

ఈ మధ్య కాలంలో తెలుగు తో పాటు తమిళ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ లు ఎక్కువగా అవుతున్నాయి. అయితే ఒకేసారి ఇద్దరు స్టార్‌ హీరోల రీ రిలీజ్ లు మాత్రం ఈ మధ్య కాలంలో కనిపించలేదు. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ ఇద్దరు సూపర్‌ స్టార్స్ అయిన రజినీకాంత్ మరియు కమల్‌ హాసన్ లు ఇప్పుడు రీ రిలీజ్ తో పోటీ పడబోతున్నారు.

కమల్ హాసన్‌ సినీ చరిత్ర చాలా గొప్పది. అందులో ఆయన నటించిన ఎన్నో సినిమాల గురించి ప్రత్యేకంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాల్లో ఆళవంధన్ సినిమా ఒకటి. ఆ సినిమా కమర్షియల్‌ గా ఆడకున్నా కూడా కమల్‌ నటన విషయంలో ప్రేక్షకులకు ఎప్పుడూ మరిచిపోలేని అనుభూతిని ఇచ్చాడు.

ఆళవంధన్‌ ను తెలుగు లో అభయ్ గా డబ్బింగ్‌ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా కమర్షియల్‌ గా నిరాశ పరిచింది.. కానీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ సినిమా ను డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు మళ్లీ తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. సురేష్‌ కృష్ణ దర్శకత్వంలో అభయ్ వచ్చింది.

ఇక రజినీకాంత్‌ హీరో గా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొంది అప్పట్లో సెన్షేషనల్‌ సక్సెస్ ను దక్కించుకుని ఆల్ ఇండియా రికార్డులను సైతం బ్రేక్ చేసిన సినిమా 'ముత్తు'. ఇండియన్ సినిమాలకు విదేశాల్లో పెద్ద ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడేలా చేసింది కూడా ముత్తు సినిమా అనడంలో సందేహం లేదు.

ముత్తు సినిమాతో పాటు ఆళవంధన్ సినిమాలను డిసెంబర్ 8న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలను కూడా ప్రపంచ వ్యాప్తంగా అత్యంధిక స్క్రీన్స్ లో రీ రిలీజ్ కి సిద్ధం చేశారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలకు దక్కని భారీ రీ రిలీజ్ ఈ రెండు సినిమాలకు దక్కబోతున్నాయి.

ఇంత పెద్ద క్రేజీ స్టార్స్ సినిమాల రీ రిలీజ్ అనగానే ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతుంది. అప్పట్లో కమర్షియల్‌ గా హిట్ అవ్వని ఆళవంధన్‌ ఇప్పుడు ముత్తుకు ఆ రేంజ్ లో పోటీ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకర విషయం అంటూ తమిళ్‌ మీడియా వర్గాల వారి టాక్‌.