Begin typing your search above and press return to search.

పవన్ నిర్మాతలతో రేణు దేశాయ్.. ఇది అసలు విషయం!

పవన్ కల్యాణ్ తో మంచి సంబంధాలు ఉన్న ఈ నిర్మాణ సంస్థలో ఆమె కోసం ప్రత్యేక క్యాబిన్ కూడా డిజైన్ చేశారని వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   7 Dec 2023 5:02 AM GMT
పవన్ నిర్మాతలతో రేణు దేశాయ్.. ఇది అసలు విషయం!
X

హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల కాలంలో చాలా సార్లు వార్తల్లో నిలుస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె.. నిర్మాతగా ఇండస్ట్రీలో రాణించాలని ఎప్పటి నుంచో కోరుకుంటోంది. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో ఆమెనే చెప్పింది. అయితే తన కల నెరవేర్చుకునేందుకు రేణు దేశాయ్.. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు గతకొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పవన్ కల్యాణ్ తో మంచి సంబంధాలు ఉన్న ఈ నిర్మాణ సంస్థలో ఆమె కోసం ప్రత్యేక క్యాబిన్ కూడా డిజైన్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రేణుదేశాయ్ సన్నిహితులు స్పందించారు. అలాంటిదేం జరగలేదని స్పష్టం చేశారు. రేణు దేశాయ్ వాళ్లకు ఓ కథను చెప్పారని వివరించారు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

నిర్మాణ సంస్థతో ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. దీంతో ఆ రూమర్లకు చెక్ పెట్టినట్లైంది. పవన్ కల్యాణ్ ఇటీవలే హీరోగా తెరకెక్కిన బ్రో సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే తెరకెక్కించింది. జనసేన పార్టీలో ముఖ్యనేత అయిన నాదెండ్ల మనోహర్ కు పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ సన్నిహితులు.

ఆయా విధంగా పవన్ తో కూడా వీరికి మంచి రిలేషన్ ఏర్పడింది. అలాగే రేణు దేశాయ్ తో కూడా వారికి మంచి సంబంధాలు ఉన్నాయట. బద్రి మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్‌ ఆ తర్వాత చేసిన సినిమాలు తక్కువే అయినా నటిగా మంచి పేరే తెచ్చుకుంది. 2009లో హీరో పవన్ కల్యాణ్, రేణు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కానీ నాలుగేళ్లకు కొన్ని కారణాల వల్ల విడిపోయారు. రేణు దేశాయ్ నటించిన చివర సినిమా జానీ. కాగా తాజాగా టైగర్‌ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడం వల్ల ఆమె క్యారెక్టర్ కు కూడా గుర్తింపు రాలేదు. అయితే ప్రస్తుతానికి ఆ రూమర్లకు చెక్ పెట్టినా.. భవిష్యత్తులో ఏదో నిర్మాణ సంస్థలోకి రేణు దేశాయ్ ఎంట్రీ ఇస్తుందని నెటిజన్లు మాట్లాడేసుకుంటున్నారు.