Begin typing your search above and press return to search.

నారా రోహిత్ బిగ్ బ్రేక్ కు కారణం ఇదే

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు ఆరేళ్లపాటు ఎందుకు గ్యాప్ ఇచ్చారో వివరించారు. ఇక గ్యాప్ తీసుకోనని, మంచి చిత్రాలు చేస్తానని తెలిపారు.

By:  Tupaki Desk   |   22 April 2024 4:08 AM GMT
నారా రోహిత్ బిగ్ బ్రేక్ కు కారణం ఇదే
X

రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోగా మారిన నారా రోహిత్.. ఆరేళ్ల తర్వాత ప్రతినిధి-2 మూవీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఇండస్ట్రీలో హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. చివరగా 2018లో వీర‌భోగ‌వ‌సంత‌రాయ‌లులో కనిపించారు. ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

పదేళ్ల క్రితం వచ్చిన ప్రతినిధికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ప్రతినిధి-2తో మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్ 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాతో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. రాజకీయాలను టార్గెట్ ను చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అర్థమవుతోంది.

ఇటీవల నారా రోహిత్ మరో సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. సుందరకాండ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్.. సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది. ఫస్ట్ లుక్ లో నారా రోహిత్ క్లాసీగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. సెప్టెంబర్‌ 6వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. అప్పట్లో వెంకటేష్ ఇదే పేరుతో సినిమా తీసి మంచి హిట్ కొట్టగా.. రోహిత్ కూడా సూపర్ హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

ఇదంతా పక్కనపెడితే.. ప్రస్తుతం నారా రోహిత్ ప్రతినిధి-2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. రీఎంట్రీ మూవీతో మంచి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గట్లు ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు ఆరేళ్లపాటు ఎందుకు గ్యాప్ ఇచ్చారో వివరించారు. ఇక గ్యాప్ తీసుకోనని, మంచి చిత్రాలు చేస్తానని తెలిపారు.

"ఆరేళ్ల క్రితం నేను చేసిన సినిమాలు వరుసగా ప్లాఫ్ అయ్యాయి. చెప్పాలంటే.. నాకే నా సినిమాలు నచ్చలేదు. నా కథల ఎంపిక నాకు కూడా నచ్చలేదు. దీంతో అప్పుడు ఒక రెండేళ్లు గ్యాప్ తీసుకుందామని ఫిక్స్ అయ్యా. ఆ తర్వాత కొవిడ్ వచ్చింది. ఇక గ్యాప్ మరింత ఎక్కువైంది. ఆ సమయంలో కొన్ని కథలు విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. అందులో ఒకటి ప్రతినిధి-2" అని రోహిత్ తెలిపారు. మరి ఆయనకు ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.