Begin typing your search above and press return to search.

రవితేజ - గోపిచంద్ కొత్త పోస్టర్​ కథేంటో?

బ్లాక్​ కలర్ బ్యాక్ ​గ్రౌండ్​తో డిజైన్ చేసిన ఓ స్పెషల్ పోస్టర్​ను కూడా రిలీజ్​ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

By:  Tupaki Desk   |   25 Oct 2023 5:14 PM GMT
రవితేజ - గోపిచంద్ కొత్త పోస్టర్​ కథేంటో?
X

మాస్ మహారాజా రవితేజ - దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్​లో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. రవితేజ 'డాన్ శీను' సినిమాతోనే గోపీచంద్ మలినేని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ తర్వాత 'బలుపు', 'క్రాక్' చేసి ముచ్చటగా మూడు హిట్స్​ అందుకున్నారు. ఇప్పుడు నాలుగో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. తాజాగా సినిమాకు సంబంధించి బ్లాస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి.


రవితేజ - గోపిచంద్ మలినేని నాలుగో సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఆ సంస్థలో గోపీచంద్ మలినేని చేస్తున్న మరో చిత్రమిది. తాజాగా ఈ చిత్రం గురించి అఫీషియల్ అనౌన్స్​మెంట్ ఇచ్చారు మేకర్స్​.

బ్లాక్​ కలర్ బ్యాక్ ​గ్రౌండ్​తో డిజైన్ చేసిన ఓ స్పెషల్ పోస్టర్​ను కూడా రిలీజ్​ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. పోస్టర్​లో గోపిచంద్​, రివితేజ, ఇక సినిమా నిర్మాతలు కలిసి టాప్ టు బాటమ్​ ఫుల్​ బ్లాక్ కలర్ డ్రెస్​లో కనిపించారు. బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అని రాసుకొచ్చారు. అలానే మరో అప్డేట్ కూడా ఇచ్చారు.

తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడైన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు వెల్లడించారు. కొన్నేళ్ల పాటు ప్రేక్షకులు అందరికీ ఈ పాత్ర గుర్తు ఉంటుందన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని రియల్ ఇన్సిడెంట్స్​లో తెరకెక్కించనున్నారు. గతంలో మునపెన్నడు చూడని విధంగా రవితేజ లుక్, క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో 'కిక్', 'మిరపకాయ్', 'ఆంజనేయులు' సహా పలు చిత్రాలు రవితేజ - తమన్ కలయికలో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇక రవితేజ, గోపీచంద్ మలినేని, తమన్ కాంబోలో.. 'బలుపు', 'క్రాక్' వచ్చి హిట్​గా నిలిచాయి. ఈ సినిమాలో హీరోయిన్​గా రష్మిక నటించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.