Begin typing your search above and press return to search.

రెండేళ్ల పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన మాస్ రాజా

అయితే రెండేళ్ల నుండి క్లారిటీ ఇవ్వని రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆ విషయమై స్పందించాడు

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:48 AM GMT
రెండేళ్ల పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన మాస్ రాజా
X

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. దసరా కానుకగా ఈ వారంలోని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ సందర్భంగా తన ఫ్యూచర్ ప్లాన్స్ మరియు పలు ఆసక్తికర విషయాల గురించి మీడియాతో ముచ్చటించిన సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు. గత రెండు సంవత్సరాలుగా మలయాళం మూవీ రీమేక్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి రవితేజ నటించిన బోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ కి అభిమానిగా రవితేజ కనిపించబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది.

అయితే రెండేళ్ల నుండి క్లారిటీ ఇవ్వని రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆ విషయమై స్పందించాడు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా అంటూ వచ్చిన పుకార్లు తన వద్దకు వచ్చాయని.. అయితే అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ తో సినిమాకి ఒక మంచి కథతో ఎవరైనా దర్శకుడు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్నాడు. ఇతర హీరోలతో కలిసి నటించే విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో నటించిన రవితేజ భవిష్యత్తులో మరింత మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీగా ఉన్నట్లుగా పేర్కొన్నాడు. ఆ మధ్య బాలకృష్ణతో కూడా తాను సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా ఒక టాక్ షో లో పేర్కొన్నాడు. కనుక రవితేజ నుంచి త్వరలో బ్యాక్ టు బ్యాక్ మల్టీస్టారర్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయానికి వస్తే పాజిటివ్ బజ్ తో విడుదల కాబోతుంది. దసరా కానుకగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా విడుదల కాబోతుంది. కనుక బాలయ్యతో కచ్చితంగా పోటీ తీవ్రంగానే ఉంటుంది. అంతేకాకుండా విజయ్ నటించిన లియో సినిమాను కూడా దసరా కానుకగా అదే తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిది అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.