Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. ప్రేమ‌లో ప‌డిన రాశీఖ‌న్నా?

దిల్లీ బ్యూటీ రాశీఖ‌న్నా ముంబై ప‌రిశ్ర‌మ‌లో నెమ్మ‌దిగా త‌న ప‌రిధిని విస్త‌రిస్తోంది. అంతేకాదు.. ఇండ‌స్ట్రీలో త‌న స్నేహాల‌ను కూడా పెంచుకుంటోంది.

By:  Tupaki Desk   |   13 Sep 2023 12:30 AM GMT
#గుస‌గుస‌.. ప్రేమ‌లో ప‌డిన రాశీఖ‌న్నా?
X

దిల్లీ బ్యూటీ రాశీఖ‌న్నా ముంబై ప‌రిశ్ర‌మ‌లో నెమ్మ‌దిగా త‌న ప‌రిధిని విస్త‌రిస్తోంది. అంతేకాదు.. ఇండ‌స్ట్రీలో త‌న స్నేహాల‌ను కూడా పెంచుకుంటోంది. అంతేకాదు ఇప్పుడు రాశీ ప్రేమ‌లో ప‌డింద‌ని స‌మాచారం. అయితే రాశీ ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డింది? త‌న స‌హ‌చ‌రి, స్నేహితురాలు త‌మ‌న్నా త‌ర‌హాలో కోస్టార్ తో ప్రేమ‌లో ప‌డిందా? అంటే అలాంటిదేమీ లేదు. ఇటీవ‌లే రాశీ ఓ ప్రేమ‌క‌థ విందిట‌. ఆ స్క్రిప్టుతో ప్రేమ‌లో ప‌డింద‌ని తెలిసింది.


ఒక అంద‌మైన అమ్మాయి చిన్న టౌన్ నుంచి మెట్రో న‌గ‌రంలోకి అడుగుపెడుతుంది. అక్క‌డ ఒక ఆక‌తాయి అబ్బాయితో స్నేహం చేసి అత‌డితో నిండా ప్రేమ‌లో మునుగుతుంది. అటుపై ఆ ఇద్ద‌రి జీవితాల్లో ఏం జ‌రిగింద‌నేదే ఈ సినిమా క‌థాంశం. ఇక ఆక‌తాయి కుర్రాడిగా యువ‌హీరో విక్రాంత్ మాస్సే న‌టిస్తుండ‌గా, అందాల రాశి ఖన్నా అత‌డి ప్రేయ‌సిగా క‌నిపించ‌నుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు బోధయన్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించనున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఓ చమత్కారమైన ప్రేమకథతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, నవంబర్ 2023 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నామని, 2024 ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని మేక‌ర్స్ చెబుతున్నారు.

ఇద్ద‌రు ప్ర‌తిభావంతులు ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. విక్ర‌మ్ మాస్సే -రాశీ ఖన్నా ఇద్దరూ ఇటీవల వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. మాస్సే గ్యాస్‌లైట్ - ముంబైకర్ చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మాస్సే ప్రస్తుతం విధు వినోద్ చోప్రా 'ట్వ‌ల్త్ ఫెయిల్' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 27 న థియేట‌ర్ల‌లోకి రానుంది. మరోవైపు రాశీ ఖన్నా మద్రాస్ కేఫ్‌తో హిందీ సినిమాలో కెరీర్ ప్రారంభించి, ఇటీవ‌లే రాజ్ అండ్ డీకే ఫ‌ర్జీ వెబ్ సిరీస్‌లోను న‌టించి మెప్పించింది. రుద్ర అనే వెబ్ సిరీస్ తోను పేరు తెచ్చుకుంది. త‌దుప‌రి 'యోధా'లో రాశీ ఒక‌ కీల‌క‌ పాత్రను పోషించింది.

పాన్ ఇండియా ఆఫ‌ర్ల కోసం ప్ర‌య‌త్నాలు:

రాశీ ఖ‌న్నా ఇటీవ‌ల సౌత్ - నార్త్ రెండు చోట్లా భారీ ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతోందని స‌మాచారం. పాన్ ఇండియా ట్రెండ్ కి త‌గ్గ‌ట్టే పాన్ ఇండియా స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాల కోసం రాశీ ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు మ‌ణిర‌త్నం- రోహిత్ శెట్టి - ప్ర‌శాంత్ నీల్- రాజ్ అండ్ డీకే స‌హా ప‌లువురు ద‌ర్శ‌కుల‌కు రాశీ ఫుల్ ట‌చ్ లో ఉంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఫ‌ర్జీతో త‌న‌కు పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని ఇచ్చిన జ్ అండ్ డీకే రూపొందించే సినిమాల్లో రాశీ న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది.