Begin typing your search above and press return to search.

శ్రీవల్లి అర్జెంట్‌ టోక్యో ప్రయాణానికి కారణం ఇదే...!

ధనుష్ సినిమా షూటింగ్‌ జరుగుతూ ఉండగా అర్జెంట్ గా ఎందుకు ఈ అమ్మడు టోక్యోకి వెళ్తుందా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 4:59 AM GMT
శ్రీవల్లి అర్జెంట్‌ టోక్యో ప్రయాణానికి కారణం ఇదే...!
X

నిన్న మొన్నటి వరకు ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా షూటింగ్‌ లో పాల్గొన్న ముద్దుగుమ్మ శ్రీవల్లి ఆ షెడ్యూల్‌ పూర్తి అవ్వకుండానే బ్రేక్‌ తీసుకుని హఠాత్తుగా జపాన్ కి ప్రయాణం అయ్యింది. తన ప్రయాణంకు సంబంధించిన విషయాన్ని స్వయంగా రష్మిక సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది.

ధనుష్ సినిమా షూటింగ్‌ జరుగుతూ ఉండగా అర్జెంట్ గా ఎందుకు ఈ అమ్మడు టోక్యోకి వెళ్తుందా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప స్టార్‌ శ్రీవల్లి జపాన్‌ పర్యటనకు కారణం ఏంటి అనేది అందరిలో చర్చనీయాంశం అయ్యింది.

అసలు విషయం ఏంటంటే.. టోక్యో లో జరగనున్న క్రంచైరోల్‌ అనిమే అవార్డ్స్ వేడుకకి రష్మిక హాజరు అవ్వబోతుంది. ఆ వేడుక లో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతుంది. సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఆ అవార్డ్‌ వేడుకకు ఆహ్వానం అందుకున్న అరుదైన హీరోయిన్ గా రష్మిక నిలిచింది.

పుష్ప 2 సినిమాతో పాటు రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు ఇంకా శేఖర్‌ కమ్ముల, ధనుష్‌ కాంబో సినిమాలో నటించడంతో పాటు హిందీలో కూడా ఈఅమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి. యానిమల్‌ సినిమా తర్వాత హిందీ ఫిల్మ్‌ మేకర్స్ పలువురు ఈ అమ్మడి తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

రష్మిక మందన్న హీరోయిన్‌ గా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఫుల్‌ బిజీగా ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు నటన మరియు డాన్స్ లో ఈ అమ్మడిని మించిన వారు లేరని పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. అందుకే అరుదైన క్రంచైరోల్‌ అనిమే అవార్డ్స్ లో రష్మిక కి ఛాన్స్ దక్కింది.