Begin typing your search above and press return to search.

శ్రీవల్లి స్పీడ్ గురించి టాలీవుడ్ లో డిస్కషన్!

నేషనల్‌ క్రిస్ రష్మిక మందన్న ఖాతాలో 'యానిమల్‌' రూపంలో మరో విజయం పడింది. ఈసారి బాలీవుడ్‌ లో ఈ అమ్మడు సక్సెస్ దక్కించుకోవడం చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవాలి.

By:  Tupaki Desk   |   7 Dec 2023 7:40 AM GMT
శ్రీవల్లి స్పీడ్ గురించి టాలీవుడ్ లో డిస్కషన్!
X

నేషనల్‌ క్రిస్ రష్మిక మందన్న ఖాతాలో 'యానిమల్‌' రూపంలో మరో విజయం పడింది. ఈసారి బాలీవుడ్‌ లో ఈ అమ్మడు సక్సెస్ దక్కించుకోవడం చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవాలి. హిందీలో ఇప్పటి వరకు రష్మిక మందన్న గుడ్‌ బై మరియు మిషన్ మజ్ను సినిమాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి.

బాలీవుడ్‌ లో ఎట్టకేలకు యానిమల్‌ సినిమాతో సాలిడ్‌ సక్సెస్ ను అందుకుని బోనీ కొట్టిన ఈ అమ్మడు సౌత్ లో కూడా జోరు కంటిన్యూ చేస్తుంది. యానిమల్ ఇచ్చిన జోష్ తో మరింత స్పీడ్‌ గా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం పుష్ప 2 వంటి ప్రతిష్టాత్మక భారీ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే.

పుష్ప 2 సినిమాలో నటిస్తూనే మరో వైపు ఇతర సినిమాలను కూడా రష్మిక చేస్తుంది. సుకుమార్‌ నుంచి పర్మీషన్ తీసుకుని మరీ తాను కొత్త సినిమాలకు కమిట్‌ అవుతున్నట్లుగా ఆ మధ్య ఒక చిట్‌ చాట్‌ లో రష్మిక పేర్కొంది. అందులో భాగంగా రష్మిక తాజాగా గర్ల్‌ ఫ్రెండ్‌ అనే సినిమాను రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో మొదలు పెట్టింది. తాజాగా షూటింగ్‌ షురూ అయింది.

ఇక రెయిన్ బో అనే చిత్రంలో కూడా రష్మిక నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూడు సినిమాలే కాకుండా నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో కూడా రష్మిక మందన్న నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

భీష్మ సినిమా కాంబినేషన్‌ లో సినిమా అంటూ ఆ మధ్య ఒక వీడియోను కూడా విడుదల చేసి మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా ఆ సినిమా ను ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ లేదు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌ లో రష్మిక పాల్గొంటుందేమో చూడాలి. మొత్తానికి నేషనల్‌ క్రష్‌ శ్రీవల్లి రష్మిక మందన్న జోరు మామూలుగా లేదనే చెప్పాలి.