Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ మరో క్రేజీ రూమర్‌తో భారీ హైప్‌

ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు, పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయింది.

By:  Tupaki Desk   |   29 April 2025 11:03 AM IST
ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ మరో క్రేజీ రూమర్‌తో భారీ హైప్‌
X

ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు, పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇటీవలే ఎన్టీఆర్‌ షూటింగ్‌లో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే. కర్ణాటకలో భారీ సెట్‌ నిర్మించిన ప్రశాంత్‌ నీల్‌ మెజార్టీ షూటింగ్‌ పార్ట్‌ను అక్కడే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాట ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పాట కోసం ప్రముఖ హీరోయిన్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని చాలా రోజులుగా సినీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నను ఎన్టీఆర్‌-నీల్‌ మూవీలో భాగం చేసేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శ్రీవల్లిగా రష్మిక మందనకి వచ్చిన క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అలాంటి హీరోయిన్‌ ఇప్పుడు ఎన్టీఆర్‌-నీల్‌ కాంబో మూవీలో నటించడం ద్వారా కచ్చితంగా సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది స్పెషల్‌ సాంగ్‌ అయినా కచ్చితంగా ఇప్పటికే ఉన్న అంచనాలు పెంచడం ఖాయం. ఈమధ్య కాలంలో స్టార్‌ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ మంచి ఆధరణ దక్కించుకుంటున్నాయి. అంతే కాకుండా సినిమాకు అదనపు హైప్‌ను తీసుకు వస్తున్నాయి. అందుకే ఈ సినిమాలో రష్మిక మందన్నతో ఐటెం సాంగ్‌ చేయించాలని మేకర్స్ భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

బ్యాక్ టు బ్యాక్‌ యానిమల్‌, పుష్ప 2, ఛావా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. అయినా కూడా ప్రశాంత్‌ నీల్‌ వంటి స్టార్‌ దర్శకుడు అడిగితే ఎన్టీఆర్‌ వంటి సూపర్‌ స్టార్‌తో కలిసి ఐటెం సాంగ్‌ చేసేందుకు రష్మిక మందన్న నో చెప్పే అవకాశం లేదని కొందరు అంటున్నారు. ఇప్పటి వరకు ఈ విషయం పుకారుగానే ప్రచారం జరుగుతోంది. మేకర్స్‌ లో ఆలోచన అనేది లేకుండా ఇలాంటి పుకారు వచ్చే అవకాశం లేదు. కనుక మేకర్స్‌ ఏదో ఒక సమయంలో ఐటెం సాంగ్‌ను రష్మిక మందన్నతో చేయిస్తే బాగుంటుందని అనుకుని ఉంటారు, అందుకే ప్రచారం మొదలైంది.

ఇప్పటి వరకు ఆ విషయమై మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతానికి జరుగుతున్న ప్రచారం కారణంగా సినిమాకు మంచి హైప్‌ క్రియేట్‌ అవుతుంది. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పైగా రష్మిక మందన్న వంటి స్టార్‌ హీరోయిన్‌ ఐటెం సాంగ్‌ చేస్తే అది అదనపు హైప్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీలో రష్మిక మందన్న ఐటెం సాంగ్‌ చేయాలని చాలా మంది సినీ అభిమానులు ముఖ్యంగా ఎన్టీఆర్‌ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ విషయమై ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. ఎన్టీఆర్‌-నీల్‌ కాంబో మూవీ 2026 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.