Begin typing your search above and press return to search.

రణబీర్ నోట బాలయ్య డైలాగ్

లేటెస్ట్ గా వచ్చిన లీక్స్ ప్రకారం.. రణబీర్ కపూర్ బాలయ్య బాబు పవర్ ఫుల్ డైలాగ్ ను కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   15 Nov 2023 6:36 AM GMT
రణబీర్ నోట బాలయ్య డైలాగ్
X

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న సూపర్‌హిట్ టాక్ షో "అన్‌స్టాపబుల్" కోసం ఇప్పుడు కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ జనాలు కూడా గట్టిగానే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రణబీర్ కపూర్ వంటి అతిపెద్ద సూపర్‌స్టార్ బాలయ్య తో సందడి చేయడంతో ఆ మూమెంట్స్ కోసం హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

రణబీర్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వారి తాజా చిత్రం "యానిమల్" ప్రమోషన్ కోసం ఈ షోలో అడుగు పెట్టారు. ఇటీవల షోకు సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా ఫినిష్ అయ్యింది. ఇక ఎపిసోడ్ స్ట్రీమింగ్ కంటే ముందే లీక్స్ మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని ఫొటోలు రిలీజ్ అయ్యాయి. అందులో రణబీర్ బాలకృష్ణ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపించిన విధానం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.

లేటెస్ట్ గా వచ్చిన లీక్స్ ప్రకారం.. రణబీర్ కపూర్ బాలయ్య బాబు పవర్ ఫుల్ డైలాగ్ ను కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ హిట్ డైలాగ్స్ లో ఒకటైన 'ఫ్లూటు జింక ముందు లేదు సింహం ముందు కాదు' అనే డైలాగ్ ను రణబీర్ చెబుతూ షోలోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం రీ సౌండ్ తో మారుమ్రోగిందట.

ఈ డైలాగ్ తోనే షోలో మంచి కిక్కు వస్తుంది అని చూసినవారు చెబుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ బాలీవుడ్ హీరో అలా బాలకృష్ణ డైలాగ్ చెబుతూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది అని ఫ్యాన్స్ మరింత ఆత్రుతగా ఆ షో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక యానిమల్ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే బ్రహ్మాస్త్ర సినిమాతో టాలీవుడ్ లో కూడా డీసెంట్ హిట్ అందుకున్నాడు రణబీర్ కపూర్. అలాగే అతను ఆ సినిమా ప్రమోషన్స్ కోసం టాలీవుడ్ కు కూడా వచ్చాడు. ఇక ఇప్పుడు యానిమాల్ తో సౌత్ లో మరింత సాలీడ్ హిట్ అందుకోవాలి అని చూస్తున్నాడు. మరి సినిమా అంచనాలను అందుకునే విధంగా క్లిక్ అవుతుందో లేదో చూడాలి.