Begin typing your search above and press return to search.

రాక్షస రాజు పై 'అహింస' ప్రభావం లేనట్లే...!

కానీ రాక్షస రాజు కథ తనకు బాగా నచ్చడం తో తమ్ముడి సినిమా ఫలితం తో పట్టింపు లేకుండా తేజ దర్శకత్వం లో మళ్టీ నటించేందుకు రెడీ అయ్యాడు అంటూ సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   13 Oct 2023 10:24 AM GMT
రాక్షస రాజు పై అహింస ప్రభావం లేనట్లే...!
X

రానా హీరోగా తేజ దర్శకత్వం లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడు తేజ కి మరియు రానా కి కూడా ఆ సినిమా ప్రత్యేకమైన మూవీగా నిలిచింది. సక్సెస్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వారిద్దరికి కూడా ఆ సినిమా ఒక గొప్ప విజయాన్ని అందించి కెరీర్‌ ను మళ్లీ పుంజుకునేలా చేసింది.

అందుకే ఇద్దరు మళ్లీ కలిసి ఒక సినిమా చేయాలని భావించారు. అందుకోసం దర్శకుడు తేజ రాక్షస రాజు అనే సినిమాను రానా తో చేసేందుకు సిద్ధం అయ్యాడు. అయితే ఈ సినిమా కంటే ముందు రానా తమ్ముడు అభిరామ్‌ ని 'అహింస' సినిమాతో తేజ పరిచయం చేశాడు. చాలా నమ్మకం పెట్టుకున్న అహింస సినిమా కాస్త ప్రేక్షకులకు హింస గా నిలిచింది.

అహింస ఎఫెక్ట్‌ తో రాక్షస రాజు గురించి రానా మర్చిపోయే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ రాక్షస రాజు కథ తనకు బాగా నచ్చడం తో తమ్ముడి సినిమా ఫలితం తో పట్టింపు లేకుండా తేజ దర్శకత్వం లో మళ్టీ నటించేందుకు రెడీ అయ్యాడు అంటూ సమాచారం అందుతోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రాక్షస రాజు లో కదలిక వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాక్షస రాజు సినిమా షూటింగ్ ను అక్టోబర్‌ 28న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో దర్శకుడు తేజ ఉన్నాడు. ఈ సినిమా లో రానా కి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని.. వారు ఎవరు అనే విషయాన్ని షూటింగ్‌ ప్రారంభం అయ్యాక తేజ చెప్పాలని భావిస్తున్నారు అంటూ సమాచారం అందుతోంది.

ఈ సినిమాను ఆచంట గోపీనాథ్ భారీ బడ్జెట్‌ తో నిర్మించబోతున్నాడు. రాక్షస రాజు సినిమా పూర్తి అయిన తర్వాత రానా తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ హిరణ్య కశ్యపని మొదలు పెట్టబోతున్నట్లుగా దగ్గుబాటి కాంపౌండ్ నుంచి వార్తలు వస్తున్నాయి.