Begin typing your search above and press return to search.

యానిమల్ నుంచి రాముడిగా.. వ్వాటే లుక్ రణబీర్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తెరకెక్కించిన యానిమల్ మూవీ ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 April 2024 10:00 AM GMT
యానిమల్ నుంచి రాముడిగా.. వ్వాటే లుక్ రణబీర్!
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తెరకెక్కించిన యానిమల్ మూవీ ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందో అందరికీ తెలిసిందే. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా.. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేసింది. మేకర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ మూవీలో హీరోగా నటించిన రణబీర్ కపూర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. యానిమల్ లో ఆయన యాక్టింగ్ కు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి


అయితే ఇప్పుడు రణబీర్ కపూర్.. బాలీవుడ్ ప్రతిష్టాత్మక రామాయణ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాముడిగా రణబీర్.. సీతమ్మగా హీరోయిన్ సాయి పల్లవి కనిపించనున్నారు. స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి.. గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ముంబైలో మొదలైంది. షూటింగ్ కు సంబంధించిన పిక్స్ కొన్ని లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ మూవీ కోసం రణబీర్ కపూర్.. జిమ్ లో గట్టిగా వర్కౌట్స్ చేస్తున్నారు. రాముడిగా ఒదిగిపోవాలని బాగా కృషి చేస్తున్నారు. వర్కౌట్స్ తర్వాత రణబీర్ బాడీ పిక్స్ ను సోషల్ మీడియాలో ఆయన జిమ్ ట్రైనర్ శివోహం షేర్ చేశారు. యానిమల్ లుక్ తో లేటెస్ట్ లుక్ ను కంపేర్ చేసి పోస్ట్ పెట్టారు. రామాయణ ది ఫిల్మ్ అనే హాష్ టాగ్ ను యాడ్ చేశారు.

"మూడేళ్ల నుంచి రణబీర్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. లైఫ్ లో షార్ట్ కట్స్ తీసుకోవడం వల్ల ఎవరూ సాధించిందేం లేదు. మనం అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వడానికి పక్క ప్లాన్ అవసరం. రణబీర్ సంకల్పం గొప్పది. రణబీర్ తో ఇన్నాళ్ళ జర్నీ ఎన్నో మెమోరీస్ ను ఇచ్చింది. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ కు ఇప్పుడే విషెస్ " అంటూ శివోహం రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. రణబీర్ వ్వాటే లుక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. యానిమల్ టూ రామాయణ అంటూ రణబీర్ పిక్ ను షేర్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం రణబీర్ విలు విద్య నేర్చుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు.. నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్నారు. ఈ మూవీలో రావణుడిగా కేజీఎఫ్ యశ్ కనిపించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కనిపించనున్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్ తెలుగు వెర్షన్ డైలాగులను త్రివిక్రమ్ అందించనున్నట్లు టాక్. మరి తొలి భాగం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.