Begin typing your search above and press return to search.

డ‌బుల్ ఇస్మార్ట్ పై రామ్ క్లారిటీ ఇదే!

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరెక్కుతోన్న 'డ‌బుల్ ఇస్మార్ట్' ఇప్ప‌టికే రిలీజ్ అల‌స్య‌మైన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 March 2024 12:30 AM GMT
డ‌బుల్ ఇస్మార్ట్ పై రామ్ క్లారిటీ ఇదే!
X

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరెక్కుతోన్న 'డ‌బుల్ ఇస్మార్ట్' ఇప్ప‌టికే రిలీజ్ అల‌స్య‌మైన సంగ‌తి తెలిసిందే. అన్ని ప‌నులు పూర్తి చేసి మార్చి 8న రిలీజ్ చేస్తున్న‌ట్లు ముందుగా ప్ర‌క‌టించారు. కానీ షూటింగ్ అనుకున్న స‌మ‌యంలో పూర్తి కాక‌పోవ‌డంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్షన్ కూడా వేగంగా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో రిలీజ్ వాయిదా వేసారు. అప్ప‌టి నుంచి చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న దానిపై స్ప‌ష్ట‌తో లోపించింది.

మ‌రోవైపు ఏపీలో ఎన్నిక‌లు కూడా స‌మీపించిన నేప‌థ్యంలో సినిమా ఇప్ప‌ట్లో రిలీజ్ అవుతుందా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఎన్నికల‌కు ముందు అంటే మార్చి ముగింపు లేదా? ఏప్రిల్ ఆరంభంలో రిలీజ్ అవ్వాలి. ఆ త‌ర్వాత క‌ల్కి లాంటి పాన్ ఇండియా సినిమా రిలీజ్ కి ఉంది. ఆ సినిమా రిలీజ్ ముందు అయితే సినిమా కిల్ అయ్యే వ‌కాశం ఉంది. అందుకే ఈ రెండు నెల‌ల్ని వ‌దిలేసిన‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా చిత్రాన్ని జూన్ కి వాయిదా వేస్తున్న‌ట్లు రామ్ తాజాగా ప్ర‌క‌టించాడు.

జూన్ లో రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా తెలిపాడు. దీంతో రిలీజ్ పై సస్పెన్స్ వీడింది. జూన్ లో స్టార్ హీరోల చిత్రాలేవి రిలీజ్ కి లేవు. ఈ నేప‌థ్యంలో అన్నితేదీలు చూసుకుని జూన్ కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఓ సినిమా షూటింగ్ మొద‌లు పెట్టిన త‌ర్వాత ఇంత ఆల‌స్యంగా పూర్తి చేయ‌డం అన్న‌ది పూరి జ‌గ‌న్నాధ్ కెరీర్ లో ఇదే తొలిసారి. సాధార‌ణంగా రెండు..మూడు నెల‌ల్లోనే పూరి ఏ సినిమా షూటింగ్ అయినా చుట్టేస్తాడు.

కానీ వైఫ‌ల్యాలు ఎదుర‌వ్వ‌డంతో డ‌బుల్ ఇస్మార్ట్ కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయించి చేస్తున్నాడు. దీంతో షూటింగ్ ..స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా డిలే అవుతుంది. ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాధ్ -చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియాలో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా 2019 లో రిలీజ్ అయిన 'ఇస్మార్ట్ శంక‌ర్' కి సీక్వెల్ గా రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే.