Begin typing your search above and press return to search.

రామ్ పై డబుల్ భారం!

పూరి జగన్నాథ్ చార్మి కాంబినేషన్లో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్కసారి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ చూశారు

By:  Tupaki Desk   |   31 July 2023 8:28 AM GMT
రామ్ పై డబుల్ భారం!
X

పూరి జగన్నాథ్, చార్మి కాంబినేషన్లో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్కసారి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ చూశారు. చార్మి నిర్మాణ భాగస్వామ్యంలో పూరి జగన్నాథ్ జ్యోతిలక్ష్మి రోగ్ పైసా వసూల్ మెహబూబా వంటి సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఆ సినిమాలో వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఊహించిన విధంగా సక్సెస్ అందుకున్నారు.

ఆ తర్వాత పూరి కొడుకుతో రొమాంటిక్ అనే సినిమా చేయగా అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక లైగర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతో అయితే పూరి కెరీర్ పై కూడా చాలా ప్రభావం పడింది. అంతే కాకుండా ఆర్థికంగా కూడా చాలా రోజులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా పూరిపై విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు.

అయితే ఈ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్న పూరి ఛార్మి ఇద్దరు కూడా తదుపరి సినిమా పైనే చాలా ఆశలు పెట్టుకున్నారు. రామ్ పోతినేనితో మళ్ళీ ఇస్మార్ట్ కాంబినేషన్ను రిపీట్ చేస్తూ డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నారు. రామ్ పోతినేని మాస్ హీరో గా అయితే మంచి క్రేజ్ అందుకుంటూ వస్తున్నాడు.

ఈ సినిమా సక్సెస్ అయితే అతని కెరీర్ మీద పెద్దగా ప్రభావం పడకపోవచ్చు కానీ పూరి, చార్మిల మీద మాత్రం తీవ్రస్థాయిలో ప్రభావం పడే అవకాశం ఉంది. లైగర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో దూసుకుపోవాలి అనుకున్న పూరీ ఛార్మికి కోలుకోవాలని దెబ్బ పడింది. ఇక మొత్తానికి రామ్ మాత్రమే వారిని మరోసారి నమ్ముతున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను ఇటీవల ముంబైలో ఫినిష్ చేశారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ను విదేశాల్లో మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ ఊహించని స్థాయిలో ఉంటాయట. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2024 మార్చి 8వ తేదీన విడుదల చేయాలని ముందే క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక మరోవైపు రా రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న స్కంద సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.