Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్‌ని ఆకాశానికెత్తేసిన పాక్ మీడియా ఎడిట‌ర్

RRRలో తనదైన‌ అద్భుత‌ నటనతో ఎల్లలు దాటిన అభిమానం సంపాదించిన రామ్ చ‌ర‌ణ్ `గ్లోబల్ స్టార్`గా ఎదిగారు

By:  Tupaki Desk   |   9 March 2024 2:36 PM GMT
చ‌ర‌ణ్‌ని ఆకాశానికెత్తేసిన పాక్ మీడియా ఎడిట‌ర్
X

RRRలో తనదైన‌ అద్భుత‌ నటనతో ఎల్లలు దాటిన అభిమానం సంపాదించిన రామ్ చ‌ర‌ణ్ `గ్లోబల్ స్టార్`గా ఎదిగారు. మెగా పవర్‌స్టార్ ట్యాలెంట్‌ని కేవ‌లం స్వ‌దేశీ మీడియా మాత్ర‌మే కాదు.. హాలీవుడ్ మీడియా సైతం కీర్తించింది. హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాల్లోను అత‌డిపై ప్ర‌శంస‌లు కురిసాయి. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు.. ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలు రామ్ చరణ్ ఈ చిత్రంలో రామరాజు పాత్రను పోషించినందుకు ప్రశంసలు కురిపించాయి. ఇప్పుడు చ‌ర‌ణ్ ని ప్ర‌శంసించే వారి జాబితాలో పాకిస్తానీ మీడియా కూడా చేరింది.

పాపుల‌ర్ పాకిస్తానీ మీడియా ప‌ర్స‌నాలిటీ హాసన్ చౌదరి, పాకిస్తాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థ అయిన `సమ్‌థింగ్ హాట్‌`కి మేనేజింగ్ ఎడిటర్. ఒక ఇంటర్వ్యూలో చౌదరి ఆర్.ఆర్.ఆర్ గురించి ప్ర‌స్థావిస్తూ.. చ‌ర‌ణ్ న‌ట‌నా సామ‌ర్థ్యాన్ని ప్ర‌శంసించారు. బ్రిటీష్ ఆఫీసర్ రామరాజుగా రామ్ చరణ్ పరిచయ సన్నివేశాన్ని గుర్తు చేసారు. నటుడిగా చ‌ర‌ణ్ కమాండ్ ని ఉనికిని ఆత్మ‌విశ్వాసాన్ని హైలైట్ చేశారు. రామ్ చరణ్ స్వాతంత్య్ర‌ సమరయోధుల గుంపును నియంత్రించడం.. ఒక వ్యక్తిని అరెస్టు చేయడం.. తనపై అధికారికి సెల్యూట్ చేస్తున్నప్పుడు కూడా అధికార భావాన్ని, క్రమశిక్షణను కొనసాగించే సన్నివేశాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఆ సన్నివేశం సహజసిద్ధ‌త‌.. వాస్తవిక చిత్రణను మెచ్చుకున్నాడు. రామ్ చరణ్ నటన ఎప్పుడూ అతిశయోక్తిగా లేదా స్పేస్ లేనిదిగా క‌నిపించ‌లేదని అన్నారు. ఈ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చ‌ర‌ణ్ అభిమానులు ర‌క‌ర‌కాల వేదిక‌ల‌పై ఈ వీడియో క్లిప్‌ని ఉత్సాహంగా షేర్ చేసారు. అతడి పెరుగుతున్న ఇమేజ్.. అంతర్జాతీయ ప్రొఫైల్‌కు మరొక సాక్ష్యంగా ఒక హాలీవుడ్ మీడియా సంస్థ ఇటీవల రామరాజు పాత్రను తాము ఇష్ట‌ప‌డే పాత్ర‌కు ఉదాహరణగా పేర్కొంది. ఈ గుర్తింపు అపారమైన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతోనే సాధ్య‌మైంది. గ్లోబ‌ల్ స్టార్ గా రామ్ చరణ్ స్థాయిని మరింత సుస్థిరం చేసింది.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా, కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. త‌దుప‌రి బుచ్చి బాబు సనా దర్శకత్వంలోను చ‌ర‌ణ్ ఒక చిత్రంలో నటించబోతున్నాడు. జాన్వీ క‌పూర్ ఇందులో క‌థానాయిక‌. ఇది కూడా రంగస్థలంలానే మ‌రో మైలురాయిగా నిలుస్తుందని రామ్ చరణ్ నమ్మకంగా ఉన్నాడు.