Begin typing your search above and press return to search.

విశాఖ బీచ్‌లో చ‌ర‌ణ్ క్యూట్ డాట‌ర్ ఆట‌లు

తాజా స‌మాచారం మేర‌కు చ‌ర‌ణ్ విశాఖపట్నంలో షూటింగ్ షెడ్యూల్‌ను ముగించాడు.

By:  Tupaki Desk   |   19 March 2024 5:59 PM GMT
విశాఖ బీచ్‌లో చ‌ర‌ణ్ క్యూట్ డాట‌ర్ ఆట‌లు
X

చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం 2022లో సెట్స్‌పైకి వెళ్లింది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. భారీ అంచనాలున్న పాన్ ఇండియా చిత్రంగా గేమ్ ఛేంజ‌ర్ వార్త‌ల్లో నిలుస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు చ‌ర‌ణ్ విశాఖపట్నంలో షూటింగ్ షెడ్యూల్‌ను ముగించాడు.

షెడ్యూల్ పూర్తి చేయ‌డంతో పాటు, అత‌డు విశాఖ బీచ్ ల‌లో త‌న ఫ్యామిలీతో విలువైన‌ స‌మ‌యాన్ని ఆస్వాధించాడు. అంతేకాదు.. విశాఖ‌లోని అంద‌మైన బీచ్ లో త‌మ వార‌సురాలు క్లిన్ కారాతో పాటు ఎంతో జాలీగా ఆట‌లు ఆడుకున్నాడు. ఇక్క‌డ ఆర్కే బీచ్ స‌హా ప‌లు బీచ్ లొకేష‌న్ల‌లో చ‌ర‌ణ్‌- ఉపాస‌న జంట క్లిన్ కారాతో స‌ర‌దాగా ఆట‌లు ఆడుతూ ఆనందిస్తూ క‌నిపించారు. అందుకు సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు అంత‌ర్జాలంలోకి వ‌చ్చింది. చ‌ర‌ణ్ వీలున్నంత వ‌ర‌కూ త‌న స‌మ‌యాన్ని ఎక్కువ‌గా కుమార్తె క్లిన్ క్లారాతో గ‌డిపేందుకే వెచ్చిస్తున్నాడు. అత‌డు ముంబై వెళ్లినా లేదా ఇంకేదైనా స్పాట్ కి వెళ్లినా త‌న‌తో పాటే క్లిన్ క్లారా కూడా ఇటీవ‌ల ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఆ ఇద్ద‌రితో ఉపాస‌న త‌ప్ప‌క జాయిన్ అవుతోంది. ఒక అంద‌మైన కుటుంబం ఫ్యాన్స్ కి కొత్త గోల్స్ ని సెట్ చేస్తోంది.

చ‌ర‌ణ్ ఇత‌ర క‌మిట్ మెంట్ల విష‌యానికి వ‌స్తే గేమ్ ఛేంజ‌ర్ ని వేగంగా పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. త్వ‌ర‌లోనే బుచ్చిబాబు తో సినిమాని ప్రారంభించ‌నున్నాడు. గేమ్ ఛేంజ‌ర్ నుంచి కొన్ని లీకులు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఇటీవ‌లే రామ్ చరణ్ ఫార్మల్ షర్ట్ ప్యాంటు ధరించి స్టైల్ గా క‌నిపించిన ఫోటోలు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న కియారా అద్వానీ సాధారణ కాటన్ చీరలో కనిపించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ రామ్ మదన్ అనే IAS అధికారి పాత్రను పోషిస్తున్నాడు . కియారా అద్వానీ కూడా IAS అధికారి పాత్రను పోషిస్తుంది. ఆ ఇద్ద‌రూ ప్రేమికులు. పొలిటికల్ యాక్షన్ డ్రామాలో ఎంగేజింగ్ స్టోరీ లైన్ క‌ట్టిప‌డేస్తుంద‌ని, ఈ సినిమా ప్రజాధనాన్ని దోపిడీ చేసే అవినీతిపై దృష్టి సారించే క‌థ‌తో తెర‌కెక్కుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్ థమన్ స్వరాలు సమకుర్చారు. విశాఖపట్నం షెడ్యూల్ తరువాత, తదుపరి షెడ్యూల్ మార్చి 21 నుండి హైదరాబాద్‌లో జరగనుంది. గేమ్ ఛేంజర్ తర్వాత, బుచ్చి బాబు సనాతో తన తదుపరి చిత్రం RC 16 ప్రారంభోత్స‌వానికి చ‌ర‌ణ్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ క‌థానాయిక‌.